అక్షర లోగిలిలో ఆనంద పండుగ | - | Sakshi
Sakshi News home page

అక్షర లోగిలిలో ఆనంద పండుగ

Jun 13 2025 4:57 AM | Updated on Jun 13 2025 5:05 AM

‘ప్రైవేటు పాఠశాలల బస్సులు గ్రామంలోకి రావొద్దు’

తిప్పర్తి : పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో తిప్పర్తి మండలంలోని రామలింగాలగూడెం మాజీ సర్పంచ్‌ ముత్తినేని శ్రీదేవిశ్యాంసుందర్‌, గ్రామపెద్దలు కలిసి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1నుంచి 5వ తరగతి వరకు పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేయించాలని, గ్రామంలోకి ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు రావొద్దంటూ గ్రామ స్టేజీ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

నల్లగొండ: వేసవి సెలవులు ముగియడంతో పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. దీంతో విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ సందర్భంగా పాఠశాలలను పూలు, మామిడి తోరణాలతో అలంకరించి విద్యార్థులకు స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తోటి స్నేహితులు కలవడంతో విద్యార్థులు కబుర్లు చెప్పుకుంటూ.. ఉపాధ్యాయులు చెప్పే విశేషాలు వింటూ గడిపారు. మొదటి రోజు కావడంతో జిల్లాలోని చాలా పాఠశాలల్లో విద్యార్థులు అంతంత మాత్రంగానే హాజరయ్యారు. జిల్లాలో 1,483 పాఠశాలు ఉండగా వాటి పరిధిలో 15 శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు.

పండుగ వాతావరణంలో..

విద్యాశాఖ పాఠశాలలు పునఃప్రారంభానికి ముందు నుంచే బడి బాట కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేవిధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే డీఈఓ భిక్షపతి ఆదేశాల మేరకు విద్యార్థులు మొదటి రోజు పాఠశాలలకు వస్తున్నందున తరగతి గదులను శుభ్రపరచడం, మామిడి తోరణాలు, బెలూన్లతో అలంకరించి పండగ వాతావరణంలో ప్రారంభించారు. పాఠశాలలకు హాజరైన విద్యార్థులకు ఉచిత పాఠ్య, నోటు పుస్తకాలతో పాటు స్కూల్‌ యూనిఫాం అందజేశారు.

పలు పాఠశాలల్లో వినూత్నంగా ఇలా..

● నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు మావిడాకులు కట్టి అందంగా అలంకరించారు.

● ఖతాల్‌ గూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు చాక్లెట్లు పంపిణీ చేసి స్వాగతం పలికారు.

● పెద్దవూరలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో హౌజింగ్‌ పీడీ, మండల ప్రత్యేకాధికారి ఎస్‌పీ రాజ్‌కుమార్‌ కేక్‌ కట్‌ చేసి ఉపాధ్యాయులు, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు యూనిఫాం, నోట్‌బుక్స్‌, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు.

● నకిరేకల్‌ మండలంలోని పాలెం గ్రామంలో పాఠశాల గేట్‌ ఎదుట రిబ్బన్‌ కట్‌ చేసి పాఠశాలను పునఃప్రారంభించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

ఫ పాఠశాలల పునఃప్రారంభం

సందర్భంగా పూలు,

మామిడి తోరణాలతో అలంకరణ

ఫ పుష్పగుచ్ఛాలు అందజేసి విద్యార్థులకు స్వాగతం పలికిన ఉపాధ్యాయులు

ఫ మొదటిరోజు 15 శాతం మంది మాత్రమే హాజరు

ఫ పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌తోపాటు స్కూల్‌ యూనిఫాం పంపిణీ

అక్షర లోగిలిలో ఆనంద పండుగ 1
1/1

అక్షర లోగిలిలో ఆనంద పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement