సాక్షిప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మణ్ను ఇటీవల ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ మంత్రిగా నియమించిన విషయం విదితమే. ఇప్పటివరకు నల్లగొండ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావును కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా నియమించింది. ఇప్పటి వరకు ఖమ్మం జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ్కుమార్రెడ్డిలకు ఈ సారి ఇన్చార్జి మంత్రి బాధ్యతలు అప్పగించలేదు.
రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ
నల్లగొండ అగ్రికల్చర్: కొత్త పాస్ పుస్తకాలు వచ్చిన రైతులు వానాకాలం సీజన్ రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి పాల్వాయి శ్రవన్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రైతు భరోసా పొందుతున్న రైతులు బ్యాంకు అకౌంట్ను మార్చుకోవాలనుకునేందుకు కూడా దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. సంబంధిత వ్యవసాయ విస్తరణాధికా రులకు పాస్బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ జీరాక్స్ను అందజేయాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మైనర్లతో వెట్టిచాకిరీ చేయించడం నేరం
రామగిరి(నల్లగొండ): మైనర్లతో వెట్టిచాకిరీ చేయించడం చట్టరీత్యా నేరమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు అన్నారు. గురువారం నల్లగొండలోని జిల్లా న్యాయ సేవా సదన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడి బయట ఉన్న బాలలను గుర్తించి పాఠశాలలో చేర్పించాలన్నారు. బాల కార్మిక నిర్మూలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారి కృష్ణవేణి, లేబర్ అధికారి అరుణకుమారి, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ భీమార్జున్రెడ్డి, గణేష్ పాల్గొన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారిగా తిరుపతిరావు
నల్లగొండ టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారిగా డాక్టర్ తిరుపతిరావు నియామకమయ్యారు. శుక్రవారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టనున్నారు. కాగా.. ఆయన గతంతో కూడా మాస్ మీడియా అధికారిగా పనిచేశారు. గర్భస్థ పిండలింగ నిర్ధారణ నిషేధిత చట్టం, గర్భవి చ్చిత్తి చట్టం, బాల్యవివాహాల నిషేధిత చట్టం, పొగాకు, గుట్కా ఉత్పత్తుల నిషేధిత చట్టాలను అమలు చేయడంతో కీలక పాత్ర పోషించారు. ఈమేరకు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మాస్ మీడియా అధికారిగా అవార్డు అందుకున్నారు.
గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ, రామగిరి : నల్లగొండలోని డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యాతత్వ శాస్త్రం, మనో విజ్ఞాన శాస్త్రం, సామాన్య శాస్త్ర బోధనా పద్ధతులు, గణిత శాస్త్ర బోధనా పద్ధతులు, సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు, తెలుగు భాష బోధన పద్ధతులు, ఆరోగ్య, వ్యాయామ విద్య, దృశ్య కళలు, కళా విద్య సబ్జెక్టులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు బయోడేటాతో పాటు జీరాక్స్ సర్టిఫికెట్లను జతపరచి ఈనెల 19 లోపు డైట్ కళాశాలలో సమర్పించాలని తెలిపారు.
ప్రభుత్వ బీఈడీ కళాశాలలో..
నల్లగొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఈనెల19 లోపు దరఖాస్తులు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9948215991 నంబర్ను సంప్రదించాలని కోరారు.

ఇన్చార్జి మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్కుమార్