
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
నల్లగొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు, రోడ్లు, భవనాలు, ఎకై ్సజ్, ఆర్టీఏ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు తగ్గించడానికి అవలంబించాల్సిన విధానాలపై శుక్రవారం కలెక్టరేట్లో రోడ్డు సేఫ్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా మీదుగా వెళ్లే 65, 167, 565, 365, 575వ నంబర్ జాతీయ రహదారులతోపాటు నార్కట్పల్లి – అద్దంకి రాష్ట్ర రహదారిపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామన్నారు. బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలు ప్రారంభమతున్న తరుణంలో ప్రైవేట్ పాఠశాలలు వారి బస్సులను ఫిట్నెస్ చేయించుకోవాలన్నారు. రహదారుల వెంట కంపచెట్లు తొలగించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాలను అమ్మే, వినియోగించే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నల్లగొండను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు మిషన్ పరివర్తన్ కింద అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ రాము, డీటీఆర్బీ రిటైర్ సీఐ అంజయ్య, ఆర్అండ్బీ, నేషనల్, స్టేట్ హైవే ఇంజనీర్, ఎకై ్సజ్, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్చంద్ర పవార్