
జిల్లా కోర్టులో అభివృద్ధి పనులు ప్రారంభం
రామగిరి(నల్లగొండ): నల్లగొండ జిల్లా కోర్డులో పలు అభివృద్ధి పనులను హైకోర్టు చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ సోమవారం హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. జిల్లా కోర్టులో హెల్త్ డిస్పెన్సరీ, రాక్ గార్డెన్, ఎలక్ట్రాన్ వెహికిల్ను ఆన్లైన్ ద్వారా వర్చువల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి నల్లగొండ అడ్మినిస్ట్రేటివ్ అధికారి టి.వినోద్కుమార్, ఇతర హైకోర్టు న్యాయమూర్తులు కె.లక్ష్మణ్, బి.విజయ్సేన్రెడ్డి, కె.సుజన, నల్లగొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు, మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సంపూర్ణ ఆనంద్, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేష్ సభ్యులు, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.