
తండ్రి బ్యాంకు ఉద్యోగి.. కొడుకు ఐఏఎస్
వెల్దండ మండలం పోషమ్మగడ్డతండాకు చెందిన వడ్యా వత్ ఉమాపతినాయక్ తన ఇద్దరు కుమారులను ఉన్న తంగా చదివించారు. ఎస్బీఐ లో ఉద్యోగిగా పనిచేస్తూ పిల్లలను చదివించేందుకు కష్టపడ్డారు. పెద్ద కుమారుడు యశ్వంత్నాయక్ ఇటీవల యూపీఎస్సీ ఫలి తాల్లో 433 ర్యాంకుతో ఐఏఎస్కు ఎంపికయ్యారు. సివిల్స్ లక్ష్యంగా సన్నద్ధమైన యశ్వంత్ రెండో ప్రయత్నంలో 2024లో 627 ర్యాంక్ సా ధించి ఐపీఎస్ సాధించారు. హైదరాబాద్లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతూనే మళ్లీ ఐఏఎస్ కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ఫలితాల్లో మెరుగైన ర్యాంకుతో ఐఏ ఎస్ సాధించారు. తల్లిదండ్రులు పద్మ, ఉమాపతి కృషి, ప్రోత్సాహంతోనే తాను విజయం సాధించానని యశ్వంత్ పేర్కొన్నారు.
గర్వంగా ఉంది..
నా పిల్లలను బాగా చదివించి ఉన్నతంగా ఎదిగేలా తీర్చి దిద్దాలనుకున్నాను. వారి చిన్నతనం నుంచే చదువుపై దృష్టిపెట్టి ప్రోత్సహించాం. పెద్ద కుమారుడు యశ్వంత్నాయక్ ఐఏఎస్ సాధించడం గర్వంగా ఉంది. చిన్న కుమారుడు కూడా సు మంత్నాయక్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నా డు. వారి చదువు కోసం పడిన శ్రమకు ఫలితం దక్కడంతో ఆనందంగా ఉన్నాను.
– యశ్వంత్తో తండ్రి ఉమాపతి నాయక్