ములుగు: జిల్లాలోని 10 మండలాల పరిధిలో గల 182 కేంద్రాలలో ఆదివారం ఉల్లాస్ (అమ్మకు అక్షరమాల) పరీక్ష నిర్వహించగా 3,924 మంది హాజరైనట్లు జిల్లా ఉల్లాస్ నోడల్ అధికారి కృష్ణబాబు తెలిపారు. జిల్లాలో 8,150 మంది నిరక్ష్యరాస్యులు పరీక్ష కోసం నమోదు చేసుకోగా 3,924 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఆదనపు కలెక్టర్ సంపత్రావు, డీఆర్డీఓ శ్రీని వాస్రావు, ఆడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్, డీఈఓ సిద్ధార్థరెడ్డి పర్యవేక్షించారు.
● టీ అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి సారంగపాణి
వరంగల్ స్పోర్ట్స్ : తెలంగాణలో 2026–27 సంవత్సరంలో నిర్వహించనున్న రాష్ట్ర, జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల క్యాలెండర్ను రూపొందించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సారంగపాణి పేర్కొన్నారు. హనుమకొండలోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు స్టాన్లీజోన్స్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి సారంగపాణి మాట్లాడుతూ..ప్రతిభ గల అథ్లెట్లను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించేందుకు తమ అసోసియేషన్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు మహిపాల్, మహిధర్, రత్నాకర్, నిర్వహణ కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, చైర్మన్ గట్టు మహేష్బాబు, చీఫ్ కోచ్ ఎండీ గౌస్, సభ్యులు మనోజ్, సోమశేఖర్, ఆయా జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.


