ములుగు రూరల్: ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె.నారాయణ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఇంటింటా సర్వే నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు, గుడిసె వాసులకు పట్టాలు, రేషన్కార్డులు, పెన్షన్లు, సాగునీరుపై దృష్టిసారి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట మ ల్లికార్జున్, సహాయ కార్యదర్శి రవిందర్, అమ్జద్పాషా, ఇంజం కొమురయ్య, ముత్యాల రాజు, నర్సయ్య, సారయ్య, సాగర్, రమేష్, నటరాజ్, రాజేందర్, లింగమూర్తి, స్వామి, పరంసింగ్, గోపి, తిరుపతి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.


