బిగ్‌బాస్‌ తనూజపై యష్మి, శ్రీ సత్య ట్రోలింగ్‌ (వీడియో) | Bigg Boss Telugu 9: Thanuja Leads Voting; Yashmi & Sri Satya Troll Her Online | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌ తనూజపై యష్మి, శ్రీ సత్య ట్రోలింగ్‌ (వీడియో)

Oct 31 2025 11:24 AM | Updated on Oct 31 2025 11:53 AM

yashmi Gowda And Sri satya trolls On Bigg boss 9 telugu contestant Tanuja

బిగ్బాస్తెలుగు సీజన్‌-9 ఇప్పటికే 50రోజులు పూర్తి చేసుకుంది. దీంతో సీజన్విజేత ఎవరు అంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు లేడీ కంటెండర్ ఎవరూ విన్నర్కాలేదు. కానీ, ఓటీటీ సీజన్‌లో బిందు మాధవి మాత్రమే విజేతగా నిలిచింది. అయితే, ఈసారి కన్నడ బ్యూటీ తనూజ ట్రోఫీ అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సోషల్మీడియాలో వైరల్అవుతుంది. ప్రస్తుతానికి పలు ఓటింగ్వేదికలలో తనే టాప్లో ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం హౌస్లో ఉన్నవారిలో తనూజ బెటర్ అంటూ చాలామంది బిగ్బాస్ఫాలోవర్స్చెప్పడం విశేషం. ఎమోషన్స్, టాస్కులు, ఎక్స్‌ప్రెషన్స్, ఇతరులతో కన్విన్సింగ్గా మాట్లాడటం వంటి అంశాల్లో ఆమె తనదైన ముద్ర వేస్తుందని చెబుతున్నారు. ఇదే సమయంలో ఆమె ఆట తీరు నచ్చని వారి నుంచి నెగెటివ్‌ కూడా సోషల్మీడియాలో కొనసాగుతుంది. ఇలా రెండు కోణాల్లో తనూజ విన్నింగ్పై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఏకంగా బిగ్బాస్టీమ్కూడా ఆమె పట్ల సానుకూలంగా ఉన్నారంటూ మరికొందరు కామెంట్లు చేశారు. అయితే, కామెంట్లు ప్రతి సీజన్లో వస్తూనే ఉంటాయి. విన్నింగ్రేసులో ఉన్న వారితో పాటు బిగ్బాస్టీమ్పై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రతిసారి చూసిందే.

తనూజపై ట్రోలింగ్కు దిగిన యష్మి, శ్రీ సత్య
తాజాగా తనూజపై పాత కంటెస్టెంట్స్ట్రోలింగ్కు దిగారు. ఒక వీడియోను తమ ఇన్స్టా స్టోరీస్లో షేర్చేశారు. బిగ్‌బాస్‌ సీజన్‌-8 కంటెస్టెంట్యష్మి గౌడ, సీజన్‌-6లో పాల్గొన్న శ్రీ సత్య స్విమ్మింగ్ఫూల్లో ఉంటూ తనూజపై పరోక్షంగా ట్రోలింగ్కు దిగారు. వారిద్దరూ తనూజను టార్గెట్ చేస్తున్నారని రెగ్యూలర్గా బిగ్బాస్చూసే వాళ్లకు సులభంగా అర్థం అవుతుందని చెప్పవచ్చు. లాస్ట్వీక్నామినేషన్ప్రక్రియలో భాగంగా మర్యాద మనీష్ హౌస్లోకి వచ్చిన విషయం తెలిసిందే.. సమయంలో కల్యాణ్ను నామినేట్చేసి హెచ్చరిస్తాడు. 'ముద్దుగా మాటలు చెప్పి మందార పూలు పెడుతున్నారు' అంటూ పరోక్షంగా తనూజతో జాగ్రత్త అనేలా హింట్ఇస్తాడు

ఇప్పుడు ఇదే పాయింట్తో యష్మి గౌడ ఇలా ట్రోలింగ్మొదలు పెట్టింది. 'అరేయ్‌.. ఏంట్రా నువ్వు ముద్దు మాటలు చెప్పి చెవిలో మందారం పువ్వులు పెడుతున్నావ్‌.. నాకు దెబ్బలు తగిలాయి ఫ్రెండ్స్‌.. ఇదీ (శ్రీ సత్య) ముద్దు ముద్దు మాటలు చెప్పి నా చెవిలో మందార పువ్వులు పెడుతుంది.' అంటూ ఇద్దరూ కలిసి ఒక వీడియో క్రియేట్చేసి వదిలారు. గతంలో కూడా ఆమె పరోక్షంగా తనూజపై పోస్టులు పెట్టింది. కేవలం పీఆర్టీమ్వల్లే తన ఆట కొనసాగుతుంది అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది. మళ్లీ ఇప్పుడు ఇలా ఏకంగా వీడియో షేర్చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement