విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి మూవీతో బిజీగా ఉన్నారు. రాయలసీమ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. బ్రిటీష్ కాలం నాటి హిస్టారికల్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబరు 11న విడుదల కానుంది.
ఇదంతా పక్కనపెడితే టాలీవుడ్ డైరెక్టర్ అభిషేక్ నామా తాజాగా నాగబంధం మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన విజయ్ దేవరకొండతో వివాదంపై స్పందించారు. మా మధ్య ఇదొక కుటుంబంలో జరిగే గొడవలాంటిదేనని అభిషేక్ నామా అన్నారు. త్వరలోనే మేమంతా కలిసిపోతామని.. కుదిరితే విజయ్తో మూవీ కూడా తీస్తానని పేర్కొన్నారు.
అయితే గతంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ అంతగా అభిమానులను మెప్పించలేకపోయింది. దీంతో మూవీ భారీ నష్టాలను తీసుకొచ్చింది. ఈ సినిమాకు అభిషేక్ నామా ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించారు. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో భారీ నష్టాలు వచ్చాయని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండను ఒక్క రూపాయి కూడా తిరిగి అడగలేదని ఆయన అన్నారు. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మా బ్యానర్లో ఆయన మరో సినిమా చేస్తారని ఆశించామని తెలిపారు. ఆయన కోసం మూడేళ్ల పాటు ఎదురుచూసినప్పటికీ ఎలాంటి రెస్పాన్స్ రాలేదని వెల్లడించారు.
కాగా.. విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వచ్చిన మూవీనే వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు, కేఏ వల్లభ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ సరసన రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్ థ్రెస్సా, ఇజ్బెల్లా లీట్లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ 2020 ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీని దాదాపు 35 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించారు.


