జేమ్స్‌ బాండ్‌: ‘నో టైమ్‌ టు డై’ ఫస్ట్‌ డే కలెక్షన్స్‌ ఎంతో తెలుసా! | No Time To Die 1st Day Collection: James Bond Film Earns Above Rs 2 Crore In India | Sakshi
Sakshi News home page

No Time To Die 1st Day Collections: ప్రపంచ వ్యాప్తంగా రూ. 600 కోట్లు వసూళ్లు

Oct 1 2021 8:09 PM | Updated on Oct 1 2021 9:18 PM

No Time To Die 1st Day Collection: James Bond Film Earns Above Rs 2 Crore In India - Sakshi

జేమ్స్‌ బాండ్‌.. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరుకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ నుంచి సిరీస్‌ వస్తుందంటే చాలు చిన్న వారి నుంచి పెద్దవారి వరకు అన్ని వయసుల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఇప్పటి వరక జేమ్స్‌ బాండ్‌ నుంచి 24పైగా సిరీస్‌లు వచ్చాయంటే ఈ బాండ్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. హాలీవుడ్‌ చిత్రమైనప్పటికీ ఇండియాలో కూడా ఈ సిరీస్‌ అత్యంత క్రేజ్‌ను సంపాదించుకుంది. 

చదవండి: జేమ్స్‌ బాండ్‌.. బై బై డేనియల్‌

ఇటీవల ఈ సిరీస్‌ నుంచి నో టైమ్‌ టు డై’ అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. గురువారం(సెప్టెంబర్‌ 30) ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్‌ విడుదలైంది. భారత్‌లో కూడా ఈ మూవీ అన్ని భాషల్లో రిలీజ్‌ అయ్యింది. ఇక భాషతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల్లో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన తొలి రోజే భారత్‌లో ఈ సిరీస్‌ రూ. 2. 25 ​కోట్లు వసూళ్లు చేయగా.. యూకేలో రూ. 4.5 మిలియన్ల యూరోలు రాబట్టింది. అయితే దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది.

చదవండి: OTT: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో వచ్చే సినిమాలివే

కరోనా కాలంలో కూడా ఈ మూవీ ప్రపంచ బాక్సాఫీసు వద్ద రికార్డు స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. విడుదలైన ఒక్క రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే బాండ్‌ సిరీస్‌లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన సిరీస్‌ ఇది. ఈ సిరీస్‌లో 5 సార్లు జేమ్స్‌ బాండ్‌గా నటించిన డేనియల్‌ క్రెగ్‌కు ఇది చివరి చిత్రం. ‘నో టైమ్‌ టు డై’ చిత్రాన్ని లండన్‌, జమైకా, ఇటలీలో చిత్రీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement