
వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని చూపించేందుకు రెడీ అవుతున్నారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ సినిమాతో సూపర్ హిట్ సాధించిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ థ్రిల్లర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు.
కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ ప్రముఖ స్టూడియోలో రూపొందించిన సెట్లో గురువారం ప్రారంభమైందని సమాచారం. నాగచైతన్యతో పాటు కొందరు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇక ఈ చిత్రంలో నాగచైతన్య సరసన మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటిస్తున్నారని, ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారని తెలిసింది. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది.