
వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి నేటితో 21 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్బంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. దీనికి ‘డేవిడ్ రెడ్డి’ అనే టైటిల్ పెట్టినట్లు ప్రకటిస్తూ.. పోస్టర్ని విడుదల చేశారు.
ఈ హిస్టారికల్ యాక్షన్ సినిమాకు హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్నాడు. 1897 - 1922 మధ్య జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందనుంది. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు అంశాలతో ఉత్కంఠభరితమైన కథతో సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం.ఈ చిత్రంలో మనోజ్ మంచు ఇంతకు ముందు ఎన్నడూ చూడని అవతారంలో కనిపించనున్నారు. బ్రిటిష్ పాలనను సవాలు చేయడానికి కుల అణచివేత నుంచి లేచిన ధైర్యవంతుడైన తిరుగుబాటు దారుడిగా కనిపించబోతున్నాడట. టైటిల్ పోస్టర్తోనే సినిమాపై హైప్ క్రియేట్ చేశారు.
"మద్రాస్ ప్రెసిడెన్సీలో జన్మించాడు, ఢిల్లీలో పెరిగాడు. ఇప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించాడు" అంటూ మేకర్స్ ఇచ్చిన రైటప్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రంతో పాటు ‘మిరాయ్’, వాట్ ది ఫిష్లోనూ మనోజ్ నటిస్తున్నారు.
With a heart full of gratitude… 🙏
Today marks 21 years of my journey in cinema. I feel truly blessed to be still doing what I love.
And with the same love and hope, sharing my 21st film titled #DavidReddy ❤️🔥
A raw, intense, high-octane historical action drama set between… pic.twitter.com/aRZhjoL1jx— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) August 6, 2025