Singer Lata Mangeshkar Test Covid Positive, Admitted To ICU - Sakshi
Sakshi News home page

Lata Mangeshkar: ఐసీయూలో ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌

Jan 11 2022 12:24 PM | Updated on Jan 11 2022 5:38 PM

Lata Mangeshkar Hospitalised After Contracting Covid, In Icu - Sakshi

Lata Mangeshkar Hospitalised After Contracting Covid, In Icu: ప్రముఖ గాయని, భారతరత్న లతా మంగేష్కర్‌(92)కు కోవిడ్‌ సోకింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స  పొందుతున్నారు. ఈ విషయాన్ని లతా మంగేష్కర్‌ మేనకోడలు రచనా ద్రువీకరించారు.'స్వల్ప లక్షణాలున్నాయి. కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచారు. దయచేసి మా గోప్యతను గౌరవించండి' అని పేర్కొన్నారు. 

కాగా గతంలో 2019లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ  లతా మంగేష్కర్‌ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. 1929,సెప్టెంబర్‌​28న జన్మించిన  లతా మంగేష్కర్ భారత అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కె, పద్మ భూషణ్, పద్మవిభూషణ్, సహా ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇండియన్‌ నైటింగల్‌గా పేరు సంపాదించిన ఆమె ఇప్పటివరకు 50వేలకు పైగా పాటలు పాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement