
రాహుల్ విజయ్, నేహా పాండే హీరో, హీరోయిన్లుగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ "ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్". ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్పై అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నూతన దర్శకుడు అశోక్ రెడ్డి కడదూరి రూపొందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
తాజాగా ఈ మూవీ నుంచి 'ఏదో ఏదో' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా.. సురేష్ బొబ్బిలి కంపోజ్ చేశారు. కార్తీక్, హరిణి పాడారు. ఈ ఫీల్ గుడ్ సాంగ్ టాలీవుడ్ అభిమానలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో అజయ్ ఘోష్, మురళీధర్ గౌడ్, గెటప్ శ్రీను, రచ్చ రవి, రవివర్మ, గంగవ్వ, జయశ్రీ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతమందిస్తున్నారు.