రేవతి కుటుంబం కోసం వెళ్లాను.. జగపతి బాబు ఫస్ట్‌ రియాక్షన్‌ | Jagapathi Babu Reaction To Sandhya Theatre Controversy, Released Video Trending On Social Media | Sakshi
Sakshi News home page

రేవతి కుటుంబాన్ని పరామర్శించా.. కానీ పబ్లిసిటీ చేసుకోలేదు: జగపతి బాబు

Dec 22 2024 5:28 PM | Updated on Dec 22 2024 5:48 PM

Jagapathi Babu Reaction To Sandhya Theatre Issue

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలో కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ నుంచి ఎవరూ పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు చాలామంది నేతలు కామెంట్‌ చేసిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబం వద్దకు సినిమా వాళ్లు ఎవరూ వెళ్లలేదని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే విషయం గురించి పుష్ప2లో కీలకపాత్రలో నటించిన జగపతి బాబు రియాక్ట్‌ అయ్యారు. తన సోషల్‌మీడియా ద్వారా ఒక వీడియోను విడుదల చేశారు.

'సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యాక నేను ఊరి నుంచి రాగానే.. వెంటనే ఆసుపత్రికి వెళ్లాను. సంధ్య థియేటర్‌ ఘటనలో నష్టపోయిన బాధిత కుటుంబాన్ని పరామర్శించాను.  హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స పొందుతున్న బాలుడి కోసం వెళ్లాను. కష్ట సమయంలో శ్రీతేజ తండ్రి, సోదరిని పలకరించాలని అనిపించి అక్కడకు వెళ్లా. అందరి ఆశీస్సులతో త్వరగానే బాబు కోలుకుంటాడని వారికి భరోసా ఇచ్చా. ఈ ఘటనలో అందరికంటే ఎక్కువగా కోల్పోయింది రేవతి కుటుంబం కాబట్టి నా వంతు సపోర్ట్‌ ఇద్దామని వెళ్లాను. అయితే, మానవత్వంతో మాత్రమే వెళ్లాను. దానికి పబ్లిసిటీ చేయలేదు. దీంతో ఆ విషయం ఎవరికీ తెలియదు. ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని చెబుతున్నాను.' అని జగపతి బాబు అన్నారు.

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించారు. ఆమె కుమారుడు ప్రాణాలతో పోరాడుతుంటే వెంటనే అల్లు అర్జున్‌ కుటుంబం నుంచి ఒక్కరు కూడా  ఎందుకు పరామర్శించలేదని సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్‌ చేశారు. కానీ, అల్లు అర్జున్‌ జైలు నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి క్యూ కట్టిందని సీఎం అన్నారు. వీరిలో ఒక్కరైన బాధిత కుటుంబాన్ని పరామర్శించారా..?  అని ఆయన ప్రశ్నించారు. పుష్ప సినిమా నిర్మాతలు, నటీనటులు ఎవరూ కూడా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజను చూడలేదని సీఎం వ్యాఖ్యలు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement