‘అంబాస్ రివెంజ్’ పోస్టర్
తెలుగులో కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో రూపొందిన తొలి ఫీచర్ ఫిల్మ్గా ‘అంబాస్ రివెంజ్’ నిలవనుంది. జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్గా వ్యవహరించారు. శ్రీ లలితకళా చిత్రాలు, నక్కతోక ఫిల్మ్స్పై శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా రూపొందింది.
ఈ చిత్రం టైటిల్ పోస్టర్ ‘అంబాస్ రివెంజ్’ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. శ్రీకాంత్ రెడ్డి కుందూరు, జయవర్ధన్ మాడి మాట్లాడుతూ–‘‘మహాభారతంలోని శక్తిమంతమైన అంబ పాత్ర నేపథ్యంలో ‘అంబాస్ రివెంజ్’ చిత్రాన్ని తెరకెక్కించాం. మా సినిమా ద్వారా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం’’ అన్నారు.


