
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప తర్వాత పాన్ ఇండియా నుంతి పాన్ వరల్డ్ రేంజ్కు ఎదిగిపోయారు. పుష్ప-2 మూవీతో బాక్సాఫీస్ రికార్డ్స్ను షేక్ చేశారు. దేశంలోని అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అల్లు అర్జున్కు తెలుగులో మాత్రమే కాదు.. కేరళలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమా వచ్చిందంటే చాలు మలయాళీలు థియేటర్లకు క్యూ కడతారు. అంతలా మాలీవుడ్లోనూ క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో మన ఐకాన్ స్టారే.
ఇవాళ కేరళలో ప్రతిష్టాత్మక ఓనం పండుగ కావడంతో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. మలయాళీలందరికీ హృదయపూర్వక ఓనం పండుగ శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఈ పండుగ మీ శ్రేయస్సు, శాంతితో కొత్త ప్రారంభానికి నాంది పలకాలని ఆకాంక్షించారు. ఇట్లు మీ దత్తపుత్రుడు అంటూ అల్లు అర్జున్ పోస్ట్ చేశారు. ఇది చూసిన మలయాళ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న మొదటి చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Heartfelt Onam wishes to all Malayalis!
May this Onam mark a new beginning filled with prosperity and peace. 🤍🙏🏽
Your adopted son pic.twitter.com/c1EIxyc76S— Allu Arjun (@alluarjun) September 5, 2025