మంగళవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2026
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్ ప్రతి మాసింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ కు ఏప్రిల్ 15 నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ ఏడాది యాసంగిలో 4,45,466 మెట్రిక్ టన్నుల లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే వన మహోత్సవంలో జిల్లావ్యాప్తంగా 31.7 లక్షల మొ క్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. అందుకనుగుణంగా అధికారులు పటిష్ట ప్రణాళికతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ సమస్యలపై 73 అర్జీలు అందజేశారు.
కలెక్టర్ ప్రతిమాసింగ్


