
నాన్న.. సేవ..
● తండ్రి యాదిలో చారిటబుల్ ట్రస్టులు
● సామాజిక కార్యక్రమాలతో ముందుకు..
మంచిర్యాలఅర్బన్: మంచిర్యాలకు చెందిన మల్యాల శ్రీపతి తండ్రి రాజయ్య 2007లో చ నిపోయాడు. ఆయన జ్ఞాపకార్థం సేవ చేయాలని శ్రీపతి ఆలోచించాడు. ఓసారి తన స్నేహితుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తం అవసరం కావడంతో దానం చేశాడు. ఆ తర్వా త 2013లో తండ్రి పేరిట మల్యాల రాజయ్య వెల్ఫేర్ సొసైటీ, 2024లో మల్యాల చారిటబు ల్ ట్రస్టు ఏర్పాటు చేసి రక్తదానం, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు 55 సార్లు రక్తదానం చేశాడు. రక్తం అవసరమని ఎవరైనా అడిగిన వెంటనే ట్రస్టు ద్వారా సమకూరుస్తుంటారు. మహిళలు ముందుకు రావా లనే ఉద్దేశంతో తన సతీమణి సుష్మతో ఆరుసార్లు రక్తదానం చేయించాడు. పట్టణానికి చెందిన దివ్యాంగుడు, మరో ఇద్దరు వృద్ధురాళ్లకు ప్రతీ మూడు నెలలకోసారి 25కిలోల బియ్యం అందిస్తున్నాడు.
● దుర్గం రాజేశ్ తన తండ్రి పేరిట దుర్గం పోచం చారిటబుల్ ట్రస్టు ద్వారా సేవలందిస్తున్నాడు. పాత మంచిర్యాలకు చెందిన దుర్గం పోచం కౌన్సిలర్గా పని చేస్తూ చని పోయాడు. 2020లో దుర్గం పోచం చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశాడు. స్కూల్ పిల్ల లకు యూనిఫాం, అనాథాశ్రమానికి బి య్యం అందజేశాడు. సరస్వతీ శిశుమందిర్లో ఓ పేద విద్యార్థికి ఏడాది పాటు ఫీజు చెల్లించాడు. రాళ్లపేట్ రోడ్ నంబర్–1లో శివపంచాయతన ఆలయానికి తన తండ్రి పేరిట స్థలాన్ని అప్పగించి ఆదర్శంగా నిలి చాడు. పేదల కుటుంబాల్లో వివాహాలకు ఆర్థికసాయం, కళాకారులు, క్రీడాకారులకు పోటీల సమయంలో ఆర్థికసాయం, బహుమతులు అందజేస్తున్నాడు.

నాన్న.. సేవ..