
నేడు మంత్రి వివేక్ రాక
చెన్నూర్: రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి శనివారం చెన్నూర్ నియోజకవర్గానికి రానున్నారు. మంత్రిగా ప్ర మాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా వ స్తున్న ఆయనకు ఘనంగా స్వాగతం పలకడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశా రు. ఉదయం 10గంటలకు జైపూర్ మండలం ఇందారం పెట్రోల్బంక్ నుంచి బైక్ ర్యాలీ, ఇందారం బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్, రసూల్పల్లి వద్ద స్వాగతం, జైపూర్ బస్టాండ్లో సమావేశం, భీమారం, కిష్టంపేట ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద కార్యకర్తల స్వాగతం, అక్కడి నుంచి బైక్ ర్యాలీ, చెన్నూర్ జలాల్ పెట్రోల్ వద్ద గజమాల సమర్పణ, గుస్సాడీ నృత్యాలతో స్వాగతం, అంబేద్కర్ చౌక్లో కార్నర్ మీటింగ్, సాయంత్రం 4గంటలకు రామకృష్ణాపూర్ ఏరియా ఆ స్పత్రిలో సింగరేణి కార్మిక విగ్రహ ఆవిష్కరణ, అమరవీరుల స్తూపం వద్ద నివాళులు సమర్పణ, కార్నర్ మీటింగ్, మందమర్రి పాకిస్తాన్ క్యాంప్ స్వాగతం, మందమర్రి పాత బస్టాండ్ వద్ద కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు.
టీపీసీసీ అధ్యక్షుడిని కలిసిన మంత్రి
చెన్నూర్: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను మంత్రి మంత్రి వివేక్ శుక్రవారం హైదరాబాద్లో మర్వాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరి నట్లు మంత్రి తెలిపారు.