
ఆ బడికి 63ఏళ్లు
భీమారం: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అప్పటి మారుమూల గ్రామమైన భీమారంలో ప్రభుత్వం 1963లో జెడ్పీ పాఠశాలను ఏర్పాటు చేసింది. గ్రామానికి చెందిన సంఘసేవకులు ఎన్వీ.రాజారెడ్డి కృషి కారణంగా మొదట ప్రాథమిక పాఠశాల, 1967లో పదో తరగతి మంజూరు చేసింది. దీనికి తోడు గిరిజన బాలుర హాస్టల్ ఏర్పాటు చేయడంతో ఉమ్మడి జిల్లాలోని గిరిజన గ్రామాలను నుంచి వచ్చి చదువుకున్నారు. ఇక్కడ చదివిన అనేక మంది ఉన్నత పదవులు చేపట్టారు. ఉట్నూరు ప్రాంతానికి చెందిన డాక్టర్లు తొడసం చందు, భీష్మ, పెద్దపల్లి జెడ్పీ సీఈవో నరేందర్ ఇక్కడే చదివారు. ఇప్పుడు టాటాకన్సెల్టెంగ్ సర్వీస్(టీసీఎస్)లో ఉన్నత పదవిలో ఉన్న వీ.రాజయ్య ఇక్కడే చదువుకున్నారు.