
శివాలయంలో చోరీ
కాగజ్నగర్టౌన్: పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న త్రినేత్ర శివాలయంలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్ప డ్డారు. గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు గర్భగుడి ద్వారం తాళాన్ని పగులగొట్టి శివలింగంపై ఉన్న వెండి నాగపడిగను అపహరించారు. బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకుడు విషయాన్ని గమనించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భుక్తాపూర్లో చోరీ
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని భుక్తాపూర్ కాలనీకి చెందిన రహెమాన్ ఇంట్లో చోరీ జరిగినట్లు వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. బక్రీద్ సందర్భంగా ఈనెల 3న కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన గోనధన్నూర్కు వెళ్లాడు. ఈనెల 11న ఇంటికి వచ్చిచూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోనికి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న ఐదు గ్రాముల బంగారం, రూ.6వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.
మిస్సింగ్ కేసు నమోదు
తానూరు: మండలంలోని కోలూరు గ్రామానికి చెందిన గాడేకర్ శేషారావు (35) అదృశ్యమైనట్లు ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలి పారు. శేషారావు ఈ నెల 10న ఉదయం ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కు టుంబ సభ్యులు తెలిసిన చోట్ల వెతికినా ఆ చూకీ లభించలేదు. దీంతో అతని వదినె గాడేకర్ శాంతాబాయి బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
‘భూకబ్జాకు పాల్పడిన మహిళపై చర్యలు తీసుకోవాలి’
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి లోని అంబేడ్కర్ రడగంబాల బస్తీలో ఓ మ హిళ ప్రభుత్వ భూములను కబ్జా చేసి ప్రజ లను బెదిరింపులకు గురిచేస్తోందని బాధితులు బుధవారం బెల్లంపల్లి ఆర్డీవో, తహసీ ల్దార్, మున్సిపల్ కమిషనర్లకు వేర్వేరుగా లి ఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా బాధితులు చీకటి మాధురి, ఎండీ రె హెనా బేగం, పెద్దపల్లి వరలక్ష్మి, చీకటి ల క్ష్మి, ఎండీ షహనాజ్ మాట్లాడుతూ తామంతా కూ లీ పనులు చేసుకుని బస్తీలో నివాసం ఉంటున్నామన్నారు. ఎంతో కష్టపడి పక్కా గృహా లు కట్టుకుని జీవిస్తున్న తమను ఆర్పీ మాధవి బెదిరింపులకు గురి చేస్తోందన్నారు. అక్రమంగా రాత్రి పూట నిర్మాణాలు సాగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. ప్ర భుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని, కొందరు పేదల గృహాలను కబ్జా చే యడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారని, ఇప్పటికే దాదాపు 40 గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని వివరించారు. గతంలో రెవె న్యూ, మున్సిపల్ అధికారులు అడ్డుకోగా తిరి గి కబ్జాకు యత్నాలు సా గిస్తున్నారని వివరించారు. మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి బస్తీలో సాగుతున్న అక్రమ కట్టడాలను వెంటనే ఆపాలని, భూ క బ్జాలు జరగకుండా రెవెన్యూ అధికారులు ని వారించి, మాధవిపై చర్యలు తీసుకోవాలని కోరారు.