
విత్తన చట్టం రూపకల్పనకు కృషి
● తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి
కై లాస్నగర్: నూతన విత్తన చట్టం–2025 రూపకల్పనలో రైతుల సూచనలు తీసుకుని త్వరలో అమలులోకి వచ్చేలా చర్యలు చేపడతామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డితో కలిసి తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన విత్తన చట్టం ముసాయిదా తయారీ కోసం ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, సీడ్ ఆర్గనైజర్లు, విత్తన కంపెనీ ప్రతినిధులు, డీలర్లు, రైతుల నుంచి అభిప్రాయ సే కరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ విత్తన చట్టం ముసాయిదా కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరి సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుని విత్తన చట్టం ఏర్పాటుకు కృషి చేస్తామని వివరించారు. అంతకుముందు బోరంచు శ్రీకాంత్రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించారు.