గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

Jun 11 2025 11:36 AM | Updated on Jun 11 2025 11:39 AM

గుర్త

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

కుంటాల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై అశోక్‌ తెలిపిన వివరా ల ప్రకారం.. కుంటాలకు చెందిన బాస హన్మాండ్లు (58) సోమవారం రాత్రి వర్షంలోనే నిత్యావసరాల కోసం కిరాణా దుకాణానికి వెళ్లాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రెండు కాళ్లు విరిగిపోయాయి. తల వెనుక, ముందు భాగం బలమైన గాయాలయ్యాయి. అతడిని 108 అంబులెన్స్‌లో భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. అతడి కుమారుడు గజేందర్‌ బతుకుదెరువు కోసం ఏడాదిన్నర క్రితం గల్ఫ్‌ దేశానికి వెళ్లాడు. భార్య సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

పిడుగుపాటుకు మహిళ మృతి

భీంపూర్‌: మండలంలోని నిపా ని గ్రామానికి చెందిన కలిమి నాగమ్మ (48) మంగళవారంపిడుగుపాటుకు గురై మృతి చెందింది. వివరాలు.. నిపాని గ్రామానికి చెందిన నాగమ్మ అత్త కర్మకాండలో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీపూర్‌ గ్రామ సమీపంలోని చేను వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం రావడంతో బస్టాండ్‌ వద్ద ఆగిన సమయంలో పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెకు భర్త, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.

మిస్సింగ్‌ కేసు నమోదు

మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని హమాలీవాడ కు చెందిన ఓ మహిళ అదృశ్యమైనట్లు స్థానిక ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరా ల ప్రకారం.. హమాలీవాడకు చెందిన తారచాంద్‌శర్మ భార్య అంకిత (40) ఈ నెల 7న ఉదయం కూ రగాయలు తీసుకువచ్చేందుకు మార్కెట్‌కు వెళ్లింది. సాయంత్రమైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో గాలించారు. అయినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తారచాంద్‌శర్మ మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలపై ఫిర్యాదు

వేమనపల్లి: ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగా యంటూ మండలంలోని కొత్తపల్లి గ్రామ రైతులు మంగళవారం తహసీల్దార్‌ సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సెంటర్‌లో జరిగే అవకతవకల గురించి వివరించి ఆధారాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో పీఏసీఎస్‌ ద్వారా 19 లారీల వడ్లు కొనుగోలు చేసిన నిర్వాహకులు 15 రోజులైనా రైతులకు రషీదులు, ట్రక్‌షీట్‌లు ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటివె న్నో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. విచారణ చేపడితే అక్రమాలు బయటపడతాయని తెలిపా రు. అక్రమాలపై సెంటర్‌ నిర్వాహకులను ప్రశ్నిస్తే రైతులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని, నిలదీస్తే బెదిరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం కలెక్టర్‌ను కూడా కలిసి తమ గోడు విన్నవించుకుంటామని వారు తెలిపారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి1
1/2

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి2
2/2

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement