
సమస్యలు పరిష్కరించాలని ధర్నా
పాతమంచిర్యాల: సమస్యలు పరిష్కరించాలని డి మాండ్ చేస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కుమార్ దీపక్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మ ద్దూరి రాజుయాదవ్, కమలాకర్ మాట్లాడుతూ ఈపీఎఫ్–95 కనీస పింఛన్ రూ.1000నుంచి రూ. 5000 వెంటనే చెల్లించాలని, ఈపీఎఫ్ వేతన పరి మితి రూ.15000 నుంచి రూ.30000 పెంచాలని, ఈఎస్ఐ పరిమితిని రూ.21000 నుంచి రూ.42000 పెంచాలని తెలిపారు. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలపై తక్షణమే నిషధం విధించాలని, తదితర సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, ప్రభాకర్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.