
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
● రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి
మంచిర్యాలఅగ్రికల్చర్: నూతన పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులుగా ప్రభుత్వ, ఒప్పంద ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, ఇతర శాఖల ఉద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1200 మంది ఓటర్లు మాత్రమే ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్రావు, హరికృష్ణ పాల్గొన్నారు.