
చేపమందుకు విశేష స్పందన
దండేపల్లి: ఉబ్బసం వ్యాధి నివారణకు మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా దండేపల్లిలో రంగసాయి ప్రేంరాజ్–భూలక్ష్మీ దంపతులు సోమవారం నిర్వహించిన ఉచిత చేప మందు పంపిణీకి విశేష స్పందన లభించింది. కార్యక్రమాన్ని రాష్ట్ర గిరిజన సహాకార చైర్మన్ కోట్నాక తిరుపతి ప్రారంభించారు. దూర ప్రాంతాలవారు మందు కోసం ఒక రోజు ముందే వచ్చారు. పంపిణీ సమయంలో వర్షం పడడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు వివిధ జిల్లాల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. గ్రామానికి చెందిన పలువురు వాలంటీర్లుగా సేవలు అందించారు. ఎస్సై తహాసీనొద్దీన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.