పొచ్చెరకు అడెల్లు మృతదేహం | - | Sakshi
Sakshi News home page

పొచ్చెరకు అడెల్లు మృతదేహం

Jun 9 2025 12:54 AM | Updated on Jun 9 2025 12:54 AM

పొచ్చ

పొచ్చెరకు అడెల్లు మృతదేహం

బోథ్‌:మావోయిస్ట్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అ లియాస్‌ భాస్కర్‌ మృతదేహం ఆదివారం రాత్రి పొచ్చెర గ్రా మానికి చేరుకుంది. చత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. ప్రత్యేక అంబులెన్స్‌లో స్వగ్రామానికి తీసుకువచ్చారు. యువకుడిగా దళంలోకి వెళ్లిన అడెల్లు 30 ఏళ్ల తర్వాత శవమై ఇంటికి చేరడంతో వారి రోదనలు మిన్నంటాయి. రెండురోజులుగా ఎదురుచూసినవారంతా మృతదేహం కనిపించడంతో కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామస్తులు ఎరుపు వస్త్రంను పార్థివదేహంపై కప్పి భాస్కర్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు చేశారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కు టుంబీకులు తెలిపారు. అభిమానులు, పౌర హ క్కుల సంఘం నేతలు భారీగా వచ్చే తరలివచ్చే అవకాశం ఉంది. కాగా, అక్కడి అదివాసీలు మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరారు. తామే దహన సంస్కారాలు నిర్వహిస్తామని పేర్కొనగా అక్కడి పోలీసులు దాదాపు 200 ఎస్కార్ట్‌తో అంబులెన్స్‌లో అడెల్లు మృతదేహాన్ని తెలంగాణ బార్డర్‌ వరకు పంపించారు.

స్వగ్రామంలో కుటుంబీకుల రోదనలు

నేడు అంత్యక్రియలు

పొచ్చెరకు అడెల్లు మృతదేహం1
1/2

పొచ్చెరకు అడెల్లు మృతదేహం

పొచ్చెరకు అడెల్లు మృతదేహం2
2/2

పొచ్చెరకు అడెల్లు మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement