● తరలివచ్చిన పూర్వ గురువులు, విద్యార్థులు | - | Sakshi
Sakshi News home page

● తరలివచ్చిన పూర్వ గురువులు, విద్యార్థులు

Jun 9 2025 12:54 AM | Updated on Jun 9 2025 12:54 AM

● తరలివచ్చిన పూర్వ గురువులు, విద్యార్థులు

● తరలివచ్చిన పూర్వ గురువులు, విద్యార్థులు

ఉట్నూర్‌రూరల్‌: విద్యార్థులు ఒక చోట చేరి, తమ గత స్మృతులను పంచుకోవడానికి, ఒకరినొకరు కలుసుకోవడానికి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనం పండుగలా నిర్వహించారు. ఉట్నూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌లో 1950 నుంచి 2025 బ్యాచ్‌ల వరకు పదో తరగతి చదివిన పూర్వవిద్యార్థులు, గురువులు తరలివచ్చారు. ఆదివారం ఆత్మీయ సమ్మేళనానికి మండలంలోని జేసీఎన్‌ ఫంక్షన్‌ హాల్‌ వేదికై ంది. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. 75 బ్యాచ్‌ల పూర్వవిద్యార్థులు, గురువులు ఒకే వేదికపై కలుసుకోవడం రాష్ట్రస్థాయిలో తొలి సమ్మేళనంగా చెబుతున్నారు. అంతకుముందు గురువులను బ్యాండుమేళాలతో స్వాగతం పలికారు. వారిని శాలువతో సత్కరించి సమస్కరించారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడారు. ఉపాధ్యాయులు సూచించిన మార్గంలో ప్రస్తుతం వివిధ రంగాల్లో, హో దాల్లో ఉన్నామన్నారు. ఎంపీ గోడం నగేశ్‌ మాట్లాడుతూ అదే పాఠశాలలో ఛాత్రోపాధ్యాయుడిగా పనిచేశానని గుర్తుచేశారు. ఆత్మీయ సమ్మేళననిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement