
పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య
రెబ్బెన: గుర్తుతెలియని పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. దండేపల్లి మండలం కొండపల్లికి చెందిన ముత్యాల వెంకటేశ్ (27) మంచిర్యాలలోని మేదరివాడలో వైన్స్ షాప్లో పనిచేస్తున్నాడు. 15 ఏళ్లుగా తిర్యాణిలో అమ్మమ్మ పోశక్క వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఇంటికి వచ్చి వెంకటేశ్ అప్పటికే మద్యం తాగి ఉన్నాడు. ఈక్రమంలో డబ్బుల విషయమై అమ్మమ్మతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. తాగొద్దని ఎంత చెప్పినా వినకపోవడంతో అమ్మమ్మ మందలించింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆయన రెబ్బెన మండలంలోని తక్కళ్లపల్లి బస్టాండ్ సమీపంలోని జాతీయ రహాదారి ఫ్రైఓవర్ కిందకు వచ్చి గుర్తుతెలియని పురుగుల మందు తాగాడు. ఈవిషయాన్ని బంధువులకు ఫోన్ చేసి చెప్పాడు. వారు అక్కడికి చేరుకుని అతన్ని మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మృతిచెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.
నాగోబా ఆలయ ప్రధాన పూజారి మృతి
నార్నూర్: ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయం ప్రధాన పూజారి, గాదిగూడ మండలంలోని బొడ్డిగూడకు చెందిన మెస్రం కోసు కటోడా (70) అనారోగ్యంతో మృతిచెందారు. గత పదేళ్లుగా నాగోబా ఆలయ ప్రధాన పూజారిగా కొనసాగుతున్నారు. గత కొన్నినెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం రాత్రి నుంచి ఆరోగ్యం విషమించడంతో శనివారం తె ల్లవారుజామున ఇంట్లో తుది శ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల ఆలయ కమిటీ సభ్యులు మేస్రం శేఖర్ తదితరులు సంతాపం ప్రకటించారు.
బావిలో పడి యువకుడు..
సోన్: ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతిచెందాడు. హెడ్ కానిస్టేబుల్ ప్రతాప్రెడ్డి క థనం ప్రకారం..మండలంలోని కూచన్పెల్లి గ్రామానికి చెందిన ఇందూరి మణిచందర్ (21) తన చేనులో పసుపు పంట సాగు చేస్తున్నాడు. శుక్రవారం నీళ్లు పారించడానికి అక్కడికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికినా దొరకలేదు. రాత్రి చేను వద్దకు వెళ్లి బావి వద్ద చెప్పులు, నగదు కనిపించాయి. పోలీసులకు సమాచారం అందించారు. శనివారం బావిలో మృతిదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ఏరియాస్పత్రికి తరలించారు. తండ్రి మల్లయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు.
అనుమానాస్పదంగా ఒకరు..
ఇచ్చోడ: మండలంలోని కోకస్మన్నూర్లో అర్ల గంగయ్య (52) అనుమానాస్పదంగా మృతి చెంది నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగయ్య శనివారం ఉదయం తలకు తీవ్రగాయాలై ఆపస్మాకర స్థితిలో పడి ఉన్నాడు. గ్రామస్తుల సమాచారంతో పోలీసు లు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే మృతి చెంది నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. కుమారుడు గిరిబాబు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.