ఎస్టీపీపీలో ఎస్టీ లైజన్‌ అధికారుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపీలో ఎస్టీ లైజన్‌ అధికారుల పర్యటన

Jun 8 2025 12:44 AM | Updated on Jun 8 2025 12:44 AM

ఎస్టీపీపీలో ఎస్టీ లైజన్‌ అధికారుల పర్యటన

ఎస్టీపీపీలో ఎస్టీ లైజన్‌ అధికారుల పర్యటన

జైపూర్‌: జైపూర్‌ ఎస్టీపీపీలో శనివారం ఎస్టీ లైజన్‌ అధికారుల బృందం పర్యటించింది. ఎస్టీ చీఫ్‌ లైజన్‌ ఆఫీసర్‌, జీఎం ఇల్లందు కృష్ణయ్యకు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు స్వాగతం పలికారు. అనంతరం అడ్మిన్‌ భవన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఎస్టీపీపీలో చేపడుతున్న నియమాకాల్లో ప్రమోషన్‌ పాలసీలో రూల్‌ఆఫ్‌ రిజర్వేషన్‌(ఆర్‌వోఆర్‌) అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్టీపీపీలో ఎస్టీ ఉద్యోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్టీ ఎంప్లాయీస్‌ ప్రెసిడెంట్‌ పంతులా, ఎస్టీపీపీ లైజన్‌ ఆఫీసర్‌ దేవేందర్‌, డీజీఎం పర్సనఃల్‌ అజ్మీరా తుకారాం, మోహన్‌, చంద్రమాణి, తదితరులు పాల్గొన్నారు.

బదిలీపై వెళ్తున్న అధికారులు వీడ్కోలు

ఎస్టీపీపీలో డీజీఎం(పర్సనల్‌)గా విధులు నిర్వర్తించిన అజ్మీరా తుకారాంకు అధికారులు ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయనకు ఎస్టీపీపీ ఈడీ చిరంజీవి, జీఎం శ్రీనివాసులు, శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఎస్టీపీపీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎస్టీపీపీ అఽధికారులు జెన్‌సింగ్‌, సముద్రాల శ్రీని వాస్‌, మురళీధర్‌, మోహన్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement