గోగ్యతండాకు చెందిన సుక్రునాయక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు భార్య దేవితో పాటుగా ముగ్గురు పిల్లలు శివాని, శివ, గోగ్య ఉన్నారు. కుమార్తె శివానికి గుండె సంబంధిత వ్యాధి ఉండగా.. ప్రభుత్వ పరంగా ఆపరేషన్ చేయిస్తామని నాయకులు హామీ ఇచ్చారు. పాపకు 15 ఏళ్ల లోపే ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం శివానికి 16 ఏళ్లు వచ్చాయి.. అయినా వారిని ఎవరూ
పట్టించుకోవడం లేదు. ‘ఇంటి పెద్ద లేడు. మా గోడు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు.’ అని దేవి ఆవేదన వ్యక్తం చేస్తోంది.


