అమాయకులకు వల | - | Sakshi
Sakshi News home page

అమాయకులకు వల

Jun 16 2025 7:23 AM | Updated on Jun 16 2025 7:23 AM

అమాయక

అమాయకులకు వల

గుప్తనిధులు, లంకె బిందెల పేరుతో నిలువుదోపిడీ

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మాయల మాంత్రికుడు వనపర్తి జిల్లాకేంద్రంలో ఉంటూ మంత్రగాడిగా చెలామణి అవుతున్నాడు. తాను గుప్తనిధులను వెలికితీస్తానని నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రానికి చెందిన ఓ కుటుంబాన్ని నమ్మించాడు. జిల్లాకేంద్రం నడిబొడ్డున ఉన్నవారి సొంత ఇంట్లోనే ఉన్న బంగారాన్ని బయటకు తీస్తానని చెప్పి రూ.5 లక్షల వరకు వసూలు చేశాడు. బాధితులు ఇంట్లో ఎంత లోతు తవ్వినా లంకె బిందెల జాడ కనిపించలేదు. జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. వీరిలో చాలామంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు వేస్తున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు, గద్వాల, రాజోలి మండలాలతోపాటు నల్లమలలోని పురాతన ఆలయాల్లో గుప్తనిధుల తవ్వకాలు నిత్యకృత్యంగా మారాయి. గతేడాది డిసెంబర్‌ 15న గట్టు మండలం చిన్నంపల్లిలో కొందరు వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపగా, స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదు. గతేడాది జూన్‌లో గద్వాల మండలం పూడూరులోనూ గుప్తనిధుల తవ్వకాలు చోటుచేసుకున్నాయి. మూడేళ్ల కిందట ఏకంగా జిల్లాకేంద్రంలోని గద్వాల కోటలోనే దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరపడం జిల్లాలో పరిస్థితికి అద్దం పడుతోంది.

పోలీసులకు ఫిర్యాదు

చేయండి..

ప్రజలు మాయలు, మంత్రాలు, మూఢ విశ్వాసాలను నమ్మకుండా, వాటి పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. గుప్తనిధులు, మంత్రాలు మోసపూరిత మాటలని గ్రహించాలి. మోసగాళ్లకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలి. నేరుగా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలి.

– రామేశ్వర్‌, ఏఎస్పీ, నాగర్‌కర్నూల్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ‘మాయలు, మంత్రాల పేరుతో గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మిస్తూ ఆస్తులను కాజేయడంతోపాటు అడ్డొచ్చిన వారిని హతమార్చిన ఘటన గతేడాది నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో సంచలనం రేపింది. జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణయాదవ్‌ గుప్తనిధులను వెలికితీసే పేరుతో అమాయకులను నమ్మించి, ఉన్న ఆస్తులను కాజేస్తూ ఏకంగా 11 మందిని హత్య చేసిన ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గుప్తనిధులను వెలికితీస్తానని, అందుకు వారి పేరిట ఉన్న భూములను తన పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని నమ్మించి, తర్వాత అమాయకులను మట్టుబెట్టడంలో ఈ మాయగాడు ఆరితేరాడు. నిందితుడిని అరెస్ట్‌ చేయడంతోపాటు పోలీసులు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుప్తనిధుల మాటున మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి.’

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతునేస్తం పేరుతో సాగులో మెళకువలు, సూచనలు అందించే ప్రయత్నాలు మరింత విస్తరించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జిల్లాలో గతంలో 16 రైతు నేస్తం కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ విధానం రైతులకు ప్రయోజనకరంగా ఉండటంతో అధికారుల ప్రతిపాదనల మేరకు తాజాగా మరో 32 కేంద్రాలను మంజూరు చేశారు. అలాగే ఎంపిక చేసిన వేదికల్లో దృశ్య శ్రావణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. పంట ఉత్పత్తులను పెంచే విధంగా నిపుణులు సూచనలు ఇస్తున్నారు. అన్ని గ్రామాల రైతులు కార్యక్రమానికి హాజరై వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు.

సందేహాల నివృత్తికి...

జిల్లాలోని రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా ఎరువుల యాజమాన్యం, వంగడాల ఎంపిక, కలుపు నివారణ, అధిక వర్షాల వేళ పంటల వారీగా తీసుకోవాల్సిన చర్యలు, సస్య రక్షణ చర్యలను రైతులకు వివరిస్తున్నారు. చిరు ధాన్యాలు, వాణిజ్య పంటలు, కూరగాయల సాగు విధానాలను రైతులు అడిగి తెలుసుకొని, సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. సీజన్‌కు అనుగుణంగా పశువులకు అందించాల్సిన టీకాలపై సంబంధిత శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు వచ్చే రాయితీలు, దరఖాస్తు విధానాలను వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.

మ్మడి పాలమూరులో ఇంకా మూఢనమ్మకాల జాఢ్యం వీడటం లేదు. మంత్రాలు, మాయలు, గుప్తనిధుల పేరుతో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులకు ఆశ చూపుతూ అందినకాడికి దండుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మాయగాళ్లను నమ్మి పెద్దఎత్తున సొమ్మును కోల్పోయి మోసపోతున్న ఘటనలు పెరుగుతున్నాయి. మూఢనమ్మకాల నిర్మూళనలో పోలీసులు, సంబంధిత అధికారులు చేస్తున్న కార్యక్రమాలతో ఆశించిన ప్రయోజనం ఉండటం లేదు. చాలా సందర్భాల్లో గుప్తనిధుల తవ్వకాలకు పాల్పడిన నిందితులు, సూత్రదారులు పోలీసులకు చిక్కడం లేదు.

మ్మడి జిల్లాలో మాయగాళ్లు, నాటు వైద్యులను ఆశ్రయించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో అమాయకులే లక్ష్యంగా చేసుకుని మాయగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. చిన్నపిల్లలతోపాటు మహిళలు, వృద్ధులు అనారోగ్యానికి గురైనా తాయత్తులు, బిల్లలు కడతామంటూ రోజుకొకరు చొప్పున మాయగాళ్లు పుట్టుకొస్తున్నారు. ప్రధానంగా నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో కొందరు వ్యక్తులు మంత్రాలు, నాటువైద్యం పేరుతో వ్యవస్థీకృతంగా దందా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు కొన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారిపై చర్యలు తీసుకోకుండా మాయగాళ్లకే సహకరించిన ఘటనలే ఎక్కువ.

మ్మడి జిల్లాలోని పురాతన ఆలయాలను లక్ష్యంగా చేసుకుని గుప్తనిధుల తవ్వకాలు చేపడుతూ అపురూపమైన విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఇప్పటికే నల్లమలలోని పురాతన నవ నారసింహా ఆలయం, ప్రతాప రుద్రుని కోట, రాయలగండి చెన్నకేశవ ఆలయం, బైరాపూర్‌, వడ్డేమాన్‌లోని పురాతన ఆలయాల్లో దుండగులు తవ్వకాలు జరిపి విగ్రహాలను ధ్వంసం చేశారు. అమూల్యమైన పురాతన విగ్రహాలు, ఆలయాలను పరిరక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నేడు ‘రైతు నేస్తం‘ కార్యక్రమం

మాయగాళ్లు, నాటువైద్యులు

ఆలయాల విధ్వంసం..

అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు వెనకాడని మాయగాళ్లు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా

పెరుగుతున్న దందాలు

అత్యాశకు పోయి ఉన్న సొత్తును కోల్పోతున్న వైనం

పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకడుగు

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): రైతు నేస్తం కార్యక్రమానికి రైతువేదికల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ విజయేందిరఆదేశించారు. రైతునేస్తం నిర్వహణ, ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్‌ వ్యవసాయ అధికారులతో వెబెక్స్‌ నిర్వహించి సమీక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించి.. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో ముఖాముఖి మాట్లాడుతారని కలెక్టర్‌ తెలిపారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని జిల్లాలోని రైతులందరూ వీక్షించి సద్వినియోగం చేసుకునే విధంగా రైతు వేదికలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 86 రైతు వేదికలు ఉండగా, ప్రస్తుతం 16 రైతు వేదికలలో వీడియో కాన్సరెన్స్‌ విధానం అందుబాటులో ఉందని, సోమవారం మరో 32 రైతు వేదికలలో వీసీని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా రైతు వేదికల పరిధిలోని కనీసం 250 మంది రైతులు సిద్ధంగా ఉండేలా జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు టెక్నికల్‌ సెషన్‌ ఉంటుందని, సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ప్రతి రైతు వేదికను పండగ వాతావరణంలో పచ్చని తోరణాలు, పూలతో అలంకరించాలని చెప్పారు. తహసీల్దార్‌, ఎంపీడీఓ, ఏపీఓ, మండల వ్యవసాయాధికారులు, మండల ప్రత్యేకాధికారులు అందుబాటులో ఉండాలని, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు వారికి అందుబాటులో ఉన్న రైతు వేదికలో ‘రైతు నేస్తం‘ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. ఎంపీ, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించామని, ఆయా నియోజకవర్గంలోని ఓ రైతు వేదికలో వారు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. వెబెక్స్‌లో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్‌, మోహన్‌రావు, ఆర్‌డీఓ నవీన్‌, డీఏఓ వెంకటేష్‌, డీఆర్‌డీఓ నర్సింహులు, ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

లక్ష్యాలివే...

జిల్లావ్యాప్తంగా 86 క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మించి వాటి ద్వారా పలు రకాల సలహాలు ఇస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అఽధిక దిగుబడులు సాధించి లాభాలు ఆర్జించే విధంగా రైతుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో రైతు నేస్తం ఒకటి. దృశ్య శ్రావణ సేవల విస్తరణకు వ్యవసాయంతో పాటు దానికి అనుబంధంగా ఉండే ఉద్యాన, మత్స్య, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక, నీటి పారుదలశాఖలకు సంబంధించి సలహాలు అందిస్తున్నారు. రైతునేస్తం ద్వారా కర్షకులకు అధికారులు పలు రకాల ప్రయోజనాలు చేకూరుస్తున్నారు. జిల్లాకు మంజూరైన రైతునేస్తం యూనిట్లను రైతు వేదికల్లో ఏర్పాటు చేస్తారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ సాయంతో దృశ్య శ్రావణ విధానం కొనసాగుతుంది. ఈ నిర్వహణ మొత్తం ఏఈఓలకు అప్పగించారు.

అమాయకులకు వల 1
1/2

అమాయకులకు వల

అమాయకులకు వల 2
2/2

అమాయకులకు వల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement