పెరిగిన పత్తి విత్తనాల ధరలు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన పత్తి విత్తనాల ధరలు

Jun 16 2025 7:01 AM | Updated on Jun 16 2025 7:01 AM

పెరిగ

పెరిగిన పత్తి విత్తనాల ధరలు

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): పత్తి రైతులపై కేంద్ర ప్రభుత్వం అదనపు భారం మోపింది. ఈసారి పత్తి విత్తనాల ధర పాకెట్‌పై రూ.37 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది బీటీ– 2 పత్తి విత్తనానికి ఒక పాకెట్‌కు రూ.864 ధర ఉండగా, ప్రస్తుతం రూ.37 పెంపుతో రూ. 901కి చేరింది. ఇప్పటికే మూడేళ్లుగా చీడపీడల బెడదతో పత్తి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. మార్కెట్‌లో పత్తి ధర రూ.7 వేలకు మించి పలకకపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోయారు. దీనికితోడు పంట దిగుబడి సైతం సరిగా రాలేదు. తాజా ధర పెంపుతో రైతులపై అదనపు భారం మోపినట్లయ్యింది. కాగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 3 లక్షలకుపైగా ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తారు. దీనికోసం 5 లక్షల వరకు విత్తన పాకెట్లు అవసరమవుతాయి.

ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాలతోపాటు దేవరకద్ర, చిన్నచింతకుంట, మిడ్జిల్‌, మూసాపేట, అడ్డాకుల, నవాబుపేట, జడ్చర్ల, రాజాపూర్‌, బాలానగర్‌, భూత్పూర్‌ తదితర ప్రాంతాల్లో అత్యధికంగా బీటీ– 2 పత్తి సాగు చేస్తారు. ఇటీవల కురిసిన కొందరు రైతులు విత్తనాలు విత్తుకోగా.. మరికొందరు దుక్కులు దున్ని విత్తనాలు విత్తేందుకు భూమిని సిద్ధం చేసుకుంటున్నారు.

బీటీ–2 పత్తి విత్తనాల ధరలు ఇలా

సంవత్సరం పాకెట్‌ ధర

(రూ.లలో..)

2018 690

2019 710

2020 730

2021 767

2022 810

2023 853

2024 864

2025 901

ఒక్కో పాకెట్‌పై రూ.37 పెంపు

పెరిగిన పత్తి విత్తనాల ధరలు 1
1/1

పెరిగిన పత్తి విత్తనాల ధరలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement