విధుల్లో అంకితభావంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అంకితభావంతో పనిచేయాలి

Jul 30 2025 7:00 AM | Updated on Jul 30 2025 7:00 AM

విధుల్లో అంకితభావంతో పనిచేయాలి

విధుల్లో అంకితభావంతో పనిచేయాలి

గార్ల: విధుల్లో రెవెన్యూ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు. మంగళవారం గార్ల తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేసి.. భూభారతి దరఖాస్తులపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్న రైతుల భూ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. విద్యార్థుల కుల, ఆదాయ, నివాసం సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేయొద్దన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ శారద, డీటీ సంజీవ, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీరామ్‌, ఆర్‌ఐ స్వప్న, రాంబాబు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

భూసమస్యలపై దృష్టి సారించాలి

డోర్నకల్‌: మండలంలో భూ సమస్యలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం అదనపు కలెక్టర్‌ భూభారతిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఇమ్మానీయల్‌ పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement