
నీట్–25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం
విద్యారణ్యపురి : నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్టెస్ట్ (నీట్–యూజీ –25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎ. వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్రెడ్డి, సంతోశ్ రెడ్డి శనివారం తెలిపారు. నీట్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీలు కలిపి పి. సాయిదివ్యాన్ ఆల్ ఇండియాలో 14వ ర్యాంకు, బి. ప్రియాంక 100వ ర్యాంకు, ఎం. వినయ్ 226వ ర్యాంకు, బి. గణేశ్ 671వ ర్యాంకు సాధించారని వారు తెలిపారు. రాష్ట్రంలోని ‘ఎస్ఆర్’ విద్యాసంస్థలకు చెందిన 210 మందికిపైగా విద్యార్థులు మెడిసిన్లో సీట్లు సాధించేలా ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. భవిష్యత్లో మరిన్ని ర్యాంకులు సాధించేలా తమ విద్యార్థులను తీర్చిదిద్దుతామని తెలిపారు. 50 సంవత్సరాల్లో పటిష్ట ప్రణాళికతో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ఎంసెట్, ఐఐటీల్లో విద్యనందిస్తూ ప్రతీ ఏడాది జాతీయ స్థాయి పోటీపరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నామన్నారు. ఈఏడాది జేఈఈ మెయిన్స్ –25 జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వారు చెప్పారు. ఈ ఫలితాలు విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం కావాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.

నీట్–25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం

నీట్–25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం

నీట్–25 ఫలితాల్లో ‘ఎస్ఆర్’ ప్రభంజనం