
నీట్గా మెరిశారు..
నేషనల్ ఎల్జిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్–యూజీ –25) ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా విద్యార్థులు మెరిశారు. శనివారం విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. దీనిపై కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు హర్షం చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ర్యాంకర్లు, తల్లిదండ్రులను సన్మించారు.
మానుకోట విద్యార్థుల ప్రతిభ..
మహబూబాబాద్ అర్బన్: నీట్ ఫలితాల్లో మానుకోట విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాల అధ్యాపకుడు బొడ్డుపల్లి శ్రీనివాస్, మాధురి దంపతుల కుమారుడు ప్రణీతమ్ సుహాస్ 720 మార్కులకు 408 మార్కులు సాధించాడు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు కళ్లెం వెంకట్రెడ్డి, సుజాత దంపతుల కుమారై వర్షితారెడ్డి 720 మార్కులకు 431 మార్కులు సాధించింది. అలాగే, పిట్టల శ్రీమతి, మహేందర్ దంపతుల కుమారై అభిన్య 720 మార్కులకు 500 మార్కులు సాధించింది.
–సాక్షి నెట్వర్క్
షణ్ముఖకు 48వ ర్యాంకు..
కేయూ క్యాంపస్: జాతీయ స్థాయిలో మెడిసిన్లో ప్రవేశాలకు గాను నిర్వహించిన నీట్ (నేషనల్ ఎల్జిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) ఫలితాల్లో హనుమకొండకు చెందిన యాండ్రపాటి షణ్ముఖ 720 మార్కులుకు 656 మార్కులు సాధించి ఆల్ఇండియా 48వ ర్యాంకు కై వసం చేసుకున్నాడు. హనుమకొండ టీచర్స్ కాలనీకి చెందిన యాండ్రపాటి శ్యాంసుందర్, రజనీదంపతుల కుమారుడు షణ్ముఖ పదో తరగతి హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలో, ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివాడు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే షణ్ముఖ డాక్టర్ కావాలనే లక్ష్యంతో కష్టపడి చదివి శని వారం విడుదలైన నీట్ ఫలితాల్లో ఆల్ఇండియా స్థాయిలో సత్తాచాటాడు. దీనిపై తల్లిదండ్రులు శ్యాంసుందర్, రజనీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, షణ్ముఖ ఇటీవల ఆంధ్రప్రదేశ్ విడుదల చేసిన ఏపీ ఎప్సెట్ అగ్రికల్చరల్, ఫార్మసీలోనూ రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంకు కూడా సాధించాడు.
ఢిల్లీ ఎయిమ్స్లో చేరుతా..
నీట్లో ఆల్ఇండియాలో 48వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఢిల్లీ ఎయిమ్స్ మెడిసిన్లో చేరుతా. డాక్టర్ కావాలనే లక్ష్యంతో చదివా. మా తల్లిదండ్రులు కూడా నన్ను ప్రోత్సహించారు.
షణ్ముఖ, నీట్ 48వ ర్యాంకర్
●

నీట్గా మెరిశారు..

నీట్గా మెరిశారు..

నీట్గా మెరిశారు..