
రాజేశ్కు రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కొలువులు
పాలకుర్తి టౌన్: పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన చిలుకమారి రాజేశ్ రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాఽధించాడు. హ రియాణాలోని నిట్ కురుక్షేత్ర, చైన్నెలోని కాంచీపురం ట్రిపుల్ ఐటీ అండ్ మా న్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో (ఐఐఐటీడీఎం)లో కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం సాధించాడు. పద్మాశాలి సా మాజిక వర్గానికి చెందిన చిలుకమారి సమ్మయ్య, స్వరూప దంపతుల కుమారుడు రాజేశ్ పాలకుర్తిలోని విద్యాజ్యోతి ఉన్నత పాఠశాలలో పదో తరగతి, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ ఇంజనీరింగ్లో డిప్లొమా, ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాతృశ్రీ ఇంజనీరింగ్ క ళాశాలలో సీఎస్ఐ బీటెక్ పూర్తి చేశాడు. నిట్ సిక్కింలో ఎంటెక్, నిట్ వరంగల్లో సీఎస్ఈలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ఆంధ్రప్రదేశ్లోని వీఐటీ అమరావతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తూనే నిట్ కురుక్షేత్ర, ఐఐఐటీడీఎం కాంచీపురంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగం సాధించాడు. దీంతో రాజేశ్ను పలువురు అభినందించారు.
పంచకర్మ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి
జనగామ: ఆయుర్వేద వైద్యంలో పంచకర్మ ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రముఖ వైద్యులు సూచించారు. జనగామ వేద పంచకర్మ వెల్నెస్ సెంటర్, విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ కౌశలం–2025 సదస్సు జరుగుతోంది. శనివారం వేద డాక్టర్ అంజిరెడ్డి అధ్యక్షతన ఆయుర్వేద వైద్య శాస్త్రంపై నిర్వహించిన సదస్సులో ప్రముఖ అధ్యాపకులు, వైద్య నిపుణులు ప్రయోగాత్మకజ్ఞానంతో పాటు తమ అనుభవాలు పంచుకున్నారు. డాక్టర్ సరస్వతి హిమబాల మాట్లాడుతూ సంప్రదాయ గ్రంథాల నుంచి ఆధునిక వైద్య చికిత్సల వరకు ఆయుర్వేదంలో పొందుపరిచి ఉందన్నారు. డాక్టర్ పంతులు రఘుపతి మాట్లాడుతూ పంచకర్మను సాధారణ వైద్య ప్రయోగాల్లో సమర్థవంతంగా ఎ లా అప్లయ్ చేయాలనే అంశంపై వివరణాత్మకంగా బోధించామన్నారు. డాక్టర్ సురేంద్రశర్మ మాట్లాడుతూ ఔషధ తయారీ ప్రక్రియ గురించి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన ద్వారా అవగాహన కల్పించా మన్నారు. డాక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ ఆయుర్వేద వైద్యం గొప్పదనాన్ని తెలుసుకుని రోగులకు చికిత్స చేసే సమయంలో దానిని అమలు పర్చాలన్నారు. డాక్టర్ మల్లికార్జున్ మాట్లాడుతూ కంటి వ్యా ధులు, దుష్ఫలితాలకు సంబంధించి అనేక మందికి ఆయుర్వేద వైద్యం ద్వారా చికిత్సలు చేసి విజయం సాధించామన్నారు. ఆయుర్వేద వైద్యంలో అద్భుత ఫలితాలు సాధించి, రుజువు చేయడమే కాకుండా, యువ వైద్యులకు శాసీ్త్రయం, అనుభవాత్మకంగా పరిపూర్ణత సాధించేందుకే ఇలాంటి రాష్ట్ర స్థాయి సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు.

రాజేశ్కు రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కొలువులు

రాజేశ్కు రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కొలువులు