
90 క్వింటాళ్ల నల్లబెల్లం పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా నుంచి మహబూబాబాద్ జిల్లాకు ఓ డీసీఎంలో అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం, పటిక, గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని జి ల్లా ఎకై ్సజ్ అధికారి బి.కిరణ్ తెలిపారు. ఈ మేరకు శనివారం మహబూబాబాద్ ఎకై ్సజ్ స్టేషన్ వద్ద వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ ఎకై ్సజ్ ప రిధి అనంతారం గ్రామ శివారుతోపాటు అనంతా రం నుంచి కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికి వెళ్లే మార్గమధ్యలో శుక్రవారం సాయంత్రం ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ డీసీ ఎం అటువైపురాగా ఆ వాహనాన్ని నిలిపి తనిఖీ చే యగా అందులో గుడుంబా తయారీ కోసం మహబూబాబాద్ జిల్లాకు తరలిస్తున్న 90 క్వింటాళ్ల నల్ల బెల్లం, 10 క్వింటాళ్ల పటిక, 60 లీటర్ల గుండుంబా కనిపించింది. దీంతో వాహనాన్ని సీజ్చేసి నల్ల బెల్లం, పటిక స్వాధీనం చేసుకుని మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రేకుల తండాకు చెందిన గుగులోత్ అశోక్, మొగిలిచర్లకు చెందిన నీలం వీరన్న, కోదాడ మండలం కాపుగల్లు గ్రామానికి చెందిన సంగు నరేశ్పై కేసు నమోదు చేశామని, కోదాడకు చెందిన కోనేరు మురళీమోహన్ పరారీ లో ఉన్నారని తెలిపారు. కాగా, పట్టుకున్న వాహ నం, బెల్లం, పటిక విలువ సుమారు రూ.20 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎక్సైజ్ అధికారి పేర్కొన్నారు. దాడుల్లో ఎకై ్సజ్ సీఐ జి.చిరంజీవి, ఎస్సై అశోక్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ మధు, కానిస్టేబు ళ్లు శేఖర్, సాలెం రాజ్, శ్రీనివాస్, రవి, వెంకటనరసయ్య, సత్యనారాయణ, రాజు పాల్గొన్నారు.
డీసీఎం సీజ్
వివరాలు వెల్లడించిన
జిల్లా ఎకై ్సజ్ అధికారి కిరణ్