చినుకు జాడేది! | - | Sakshi
Sakshi News home page

చినుకు జాడేది!

Jun 16 2025 6:58 AM | Updated on Jun 16 2025 6:58 AM

చినుకు జాడేది!

చినుకు జాడేది!

సాక్షి, మహబూబాబాద్‌: తొలకరి వర్షాలతో రైతులు దుక్కులు దున్ని సాగుకు సిద్ధం చేసుకున్నారు. అయితే తొలకరి తర్వాత వర్షాలు మొహం చాటేయడంతో రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇదిలా ఉండగా పదును లేకుండా విత్తనాలు వేయవద్దని, మంచి వర్షం కురిసిన తర్వాతనే నాటుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

దుక్కులు దున్ని..

జిల్లాలో వర్షం పడితే విత్తనాలు నాటేందుకు రైతులు సిద్ధం ఉన్నారు. గత ఏడాది జిల్లాలో అన్ని పంటలు కలిపి 4,29,790ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేయకగా ఇందులో 83,357 ఎకరాల్లో పత్తి, 2,19,143 ఎకరాల్లో వరితోపాటు ఇతర పంటలు వేశారు. అయితే గత ఏడాది జూన్‌ మొదటి వారంలోనే పలుచోట్ల పత్తి విత్తనాలు నాటారు. ఈ ఏడాది వరి 2,21,282 ఎకరాలు, పత్తి 84,854 ఎకరాలు, మొక్కజొన్న 58,361ఎకరాలు, మిర్చి 52,249 ఎకరాలు మొత్తం 4,22,641 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా వేశా రు. మే నెలలో కురిసిన వర్షాలకు భూమి పదును వచ్చింది. దీంతో దుక్కులు దున్నుకున్నారు. పలుచోట్ల పచ్చిరొట్ట జీలుగు, పెసర, జనుము విత్తనాలు చల్లారు. పత్తి, మొక్కజొన్న పంటలు వేసేందుకు విత్తనాలు కొనుగోలు చేసి ఉంచారు.

అదను దాటిపోతుందని ఆందోళన

ప్రతీ పంట కార్తెల ప్రకారం వేస్తేనే మంచి దిగుబడి వస్తుందని రైతుల నమ్మకం. రోహిణి, మృగశిర కార్తెల్లో వరి నార్లు పోయడం, జూన్‌ మొదటి వారంలో పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేయడం ఆనవాయి తీ. అయితే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా వస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆశించి స్థాయిలో వానలు పడలేదు. అదే విధంగా ప్రధాన నీటి వనరులైన 154 చె రువులు తెగిపోయి కట్టలు పోయకుండా ఉన్నాయి. చెక్‌డ్యామ్‌లు తెగి నీళ్లు లేకుండా ఉన్నాయి. దీంతో భూగర్భ జలాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో వర్షాలు లేకుండా బావులు, బోర్లు, చెరువులపై వ్యవసాయం చేసే పరిస్థితి సన్నగిల్లింది. వర్షం పడితేనే విత్తనాలు వేస్తారు.

జిల్లాలో వర్షపాతం వివరాలు (మి.మీలో)

జిల్లాలో రైతులు కొనుగోలు చేసిన

విత్తనాల వివరాలు

తొలకరి వర్షాలతో

దుక్కులు సిద్ధం చేసిన రైతులు

మళ్లీ వర్షం కురిస్తేనే విత్తనాలు వేసేది..

నాటిన విత్తనాలు మొలకెత్తక

రైతన్నల ఆందోళన

పదును లేకుండా విత్తనం

వేయొద్దంటున్న అధికారులు

జిల్లాలో 13వతేదీ వర్షపాతం

నెల్లికుదురు 8.8

నర్సింహులపేట 3.4

దంతాలపల్లి 5.8

తొర్రూరు 4.2

పెద్దవంగర 2.6

మొత్తం 24.8

జిల్లా సరాసరి వర్షపాతం 1.6(మి.మీ)

జిల్లాలో 14వతేదీ వర్షపాతం

మండలం వర్షపాతం

కొత్తగూడ 8.2

గంగారం 8.2

నర్సింహులపేట 4.6

దంతాలపల్లి 2.6

మొత్తం 23.6

జిల్లా సరాసరి వర్షపాతం 1.5(మి.మీ)

30 క్వింటాళ్ల పెసర 45వేల ప్యాకెట్ల పత్తి

260 క్వింటాళ్ల వరి 40 కిలోల మిర్చి గింజలు

120 క్వింటాళ్ల మొక్కజొన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement