నడిచే దైవం.. నాకు తొలినేస్తం | - | Sakshi
Sakshi News home page

నడిచే దైవం.. నాకు తొలినేస్తం

Jun 15 2025 7:28 AM | Updated on Jun 15 2025 7:28 AM

నడిచే దైవం.. నాకు తొలినేస్తం

నడిచే దైవం.. నాకు తొలినేస్తం

ఖిలా వరంగల్‌: వరంగల్‌ 34వ డివిజన్‌ శివనగర్‌కు చెందిన ఇట్టబోయిన రాజు మెడికల్‌ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తూ పిల్ల ల్ని చదివించారు. తండ్రి కష్టానికి ఫలితంగా.. కుమార్తె సాయి శివాని ఆల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌ ఫలితాల్లో 11వ ర్యాంకు సాధించారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ.. ‘కలెక్టర్‌ కాలన్నది నా లక్ష్యం కాదు. మానాన్న కోరిక. ఆయన ఎంత కష్టాన్నైనా పైకి కనపడనివ్వకుండా తనలోనే దాచుకుంటారు. నేను ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని తపిస్తారు. ఇంజనీరింగ్‌ ఈసీఈ పూర్తయిన అనంతరం ఇంటి వద్ద ఉంటూ రోజూ 18 గంటలకుపైగా సివిల్స్‌కు సన్నద్ధమయ్యా. ఇటీవల విడుదలైన ఇల్‌ ఇండియా సివిల్‌ సర్వీస్‌లో 11వ ర్యాంకు సాధించా. ‘నువ్వు కలెక్టర్‌ కావాలమ్మా’ అనేవారు. ఆయన నడిచే దైవం. నాకు తొలినేస్తం. ఆయన నింపిన స్ఫూర్తే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement