
పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి
● మాజీ ఎంపీ సీతారాంనాయక్
మహబూబాబాద్ అర్బన్/దంతాలపల్లి: రాష్ట్రంలోని పోడు భూముల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని మాజీ ఎంపీ సీతారాంనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో, దంతాలపల్లి మండలకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం వేర్వేరుగా సీతారాంనాయక్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అటవీ హక్కుచట్టం ప్రకార మే ఆదివాసీ గిరిజనులు వారి హక్కులు అడుగుతున్నారని అన్నారు. దేశంలో 720 గిరిజన తెగలు ఉన్నాయని తెలిపా రు. గ్రామసభలు నిర్వహించి అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు హక్కుపత్రాలు అందించాలని కో రారు. దేశంలోని 81 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రధాని మోదీ గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచిత రేష న్ అందచేస్తున్నారని గుర్తుచేశారు. మోదీ పాలనలో దే శం సాంకేతికంగా దూసుకెళ్తుందన్నారు. నాయకులు ఎడ్ల అశోక్రెడ్డి, శ్యాంసుందర్శర్మ, మహేష్, పూర్ణచందర్రెడ్డి, మురళి, ప్రవీణ్, ఉమేష్, రమేష్, రాణిరెడ్డి పాల్గొన్నారు.

పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి