
నిబంధనలు పాటించాలి
● శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్
మహబూబాబాద్: మాంసం విక్రయదారులు కనీస నిబంధనలు పాటించాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్సెక్టర్ కరుణాకర్ హెచ్చరించారు. మాంసం విక్రయదారులు గొర్రెలు, మేకులు కోసే విషయంలో, షాపుల నిర్వహణ తదితర అంశాలపై ఈ నెల 14(శనివారం)న ‘వ్యాపారుల ఇష్టారాజ్యం’ అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఈ కథనంపై కమిషనర్ రాజేశ్వర్ స్పందించారు. మాంసం విక్రయదారులకు నోటీసులు ఇచ్చి విక్రయాలపై అవగాహన కల్పించాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు. ఈనేపథ్యంలో శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాంసం విక్రయదారులతో మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు. ఆర్యోగంగా ఉన్న జీవాల ను కోయాలన్నారు. పశు వధశాల లేనందున కనీస నిబంధనలు పాటించాలన్నారు. ధరలు తగ్గించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరలోనే మాంసం విక్రయదారులతో సమావేశం ఉంటుందని ఆ సమావేశానికి వ్యాపారులు హాజరు కావాలని తెలిపారు.
ఉద్యమకారులకు
న్యాయం చేయాలి
మహబూబాబాద్ అర్బన్: తెలంగాణ స్వరాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రీయాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని మానుకోట జిల్లా ఉద్యమకారులు, టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డోలి సత్యనారాయణ కోరారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారికి కలెక్టరేట్లో శనివారం ఉద్యమకారులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డోలి సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కేసుల పాలయ్యామని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, 250 గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. ఉద్యమకారులకు పెన్షన్ మంజూరు చేయాలని, హెల్త్కార్డులు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారులు పిల్లి సుధాకర్, ఎండీ వాహేద్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ క్రీడాకారులను
ప్రోత్సహించాలి
● పింగిళి రమేష్రెడ్డి
మహబూబాబాద్ అర్బన్: గిరిజన జిల్లాల్లో గ్రామీణ ప్రాంత క్రీడాకారులను, బ్యాడ్మింట్ క్రీడను ప్రోత్సహించాలని బ్యాడ్మింటన్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పింగిళి రమేష్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరకాలనీ గిరిజన భవనంలో శనివారం జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పింగిళి రమేష్రెడ్డి మాట్లాడుతూ.. క్రీడలకు పుట్టినిల్లు మానుకోట జిల్లా అని.. ఈ ప్రాంతంలో బ్యాడ్మింటన్ క్రీడలు నిర్వహించి జిల్లాను రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్నారు. రానున్న రోజుల్లో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారిస్తామన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎం.జితేందర్రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా కోశాధికారి నాగకిషన్, జిల్లా కార్యదర్శి కొమ్ము రాజేందర్, జిల్లా ఉపాధ్యక్షుడు వద్దిరాజు వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ సర్వయ్య, సహాయకార్యదర్శి సాంబమూర్తి, కోశాధికారి శంకర్, సభ్యులు శ్యామ్, కిషొర్, ప్రవీణ్, సతీష్, కోటిరెడ్డి, క్రీడకారులు పాల్గొన్నారు.

నిబంధనలు పాటించాలి

నిబంధనలు పాటించాలి

నిబంధనలు పాటించాలి