మానుకోట నియోజకవర్గానికి వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

మానుకోట నియోజకవర్గానికి వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు

Jun 15 2025 7:28 AM | Updated on Jun 15 2025 7:28 AM

మానుకోట నియోజకవర్గానికి వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు

మానుకోట నియోజకవర్గానికి వెయ్యి ఇందిరమ్మ ఇళ్లు

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ నియోజకవర్గానికి అదనంగా 1,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అనుమతి ఇచ్చారని ఎంపీ పోరిక బలరాంనాయక్‌, ఎమ్మెల్యే మురళీనాయక్‌ అన్నారు. హైదరాబాదులోని సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని.. ఎంపీ బలరాంనాయక్‌, ఎమ్మెల్యే మురళీనాయక్‌ శనివారం కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని ఆదివాసీ, గిరిజన ప్రాంతాల ప్రజలు ఇళ్లులేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రికి విన్నవించామని తెలిపారు. దీంతో అదనంగా 1,500 ఇందిరమ్మ ఇళ్లు కావాలని కోరగా సానుకూలంగా స్పందించిన 1,000 ఇళ్లు నిర్మించుకోవడానికి అనుమతి ఇచ్చారన్నారు. మానుకోట అభివృద్ధిపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement