
మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు
మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వం మహబూబాబాద్, కేసముద్రం మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్, నూతనంగా ఏర్పాటైన కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారురు వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్యే మురళీనాయక్ శుక్రవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. కేసముద్రం మున్సిపాలిటీకి రూ.100 కోట్లు, మహబూబాబాద్ మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారని ఎమ్మెల్యే తెలి పారు. అలాగే మహబూబాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించి, త్వరలోనే అనుమతులు ఇస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు.
యోగాతో
సంపూర్ణ ఆర్యోగం
కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్
మహబూబాబాద్: ప్రతీ ఒక్కరు పోషకాహారం తీసుకోవడంతో పాటు యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకొని శుక్రవారం ఆయుష్శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో కలెక్టర్ అద్వైత్కుమార్ సింగ్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, వీరబ్రహ్మచారి చేతుల మీదుగా యోగా పోస్టర్లు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యోగాతోనే మానసిక ప్రశాంతత ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్శాఖ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ శ్రావణ్ కుమార్, డీవైఎస్ఓ జ్యోతి, యోగా ఇన్స్ట్రక్టర్ డాక్టర్ హేమ, కమల్, పావని, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
రామప్పను సందర్శించిన సీఆర్పీఎఫ్ ఐజీ
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శుక్రవారం సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్ సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. టూరిజం గైడ్ వెంకటేష్ ఆలయ విశిష్టతను వివరించగా రామప్ప శిల్పకళాసంపద బాగుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ రవీందర్, ఎస్సై చల్లా రాజు పాల్గొన్నారు.
రేపు చేపూరి శ్రీరాం
29వ అష్టావధానం
విద్యారణ్యపురి: హనుమకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అష్టావధాని చేపూరి శ్రీరాం 29వ అష్టావధానం ఈనెల 15న(ఆదివారం) ఉదయం 10గంటలకు హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించనున్నారు. కాకతీయ పద్య కవితావేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగనుంది. ముఖ్య అతిథిగా సహృదయ సాహితీ అధ్యక్షుడు గిరిజామనోహరబాబు, విశిష్ట అతిథిగా దహగాం సాంబమూర్తి, విశ్రాంత విద్యాశాఖ అధికారి రామేశ్వర రాజు పాల్గొంటారని నిర్వాహకులు కొండా యాదగిరి, వెలుగు ప్రభాకర్ తెలిపారు. అనంతరం పద్యకవి సమ్మేళనం నిర్వహిస్తారు.
తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతికి షోకాజ్ నోటీస్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని తెలుగు విభాగం ఇన్చార్జ్ అధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.లింగయ్యకు రిజిస్ట్రార్ వి.రామచంద్రం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. లింగయ్య తన పట్ల అమర్యాదకరంగా మాట్లాడి అవమానపర్చారని తెలుగు విభాగం విశ్రాంత ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు ఈ ఏడాది ఏప్రిల్లో రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్లో రిజిస్ట్రార్ పేర్కొన్నారు. లింగయ్య ఇచ్చే వివరణను బట్టి ఆయనపై చర్యలు ఉంటాయని భావిస్తున్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు

మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు

మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.150 కోట్లు