రాజీమార్గమే మేలు.. | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గమే మేలు..

Jun 14 2025 9:58 AM | Updated on Jun 14 2025 9:58 AM

రాజీమార్గమే మేలు..

రాజీమార్గమే మేలు..

మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రజలు పగలు, ప్రతీకారాలను పక్కనపెట్టి రాజీమార్గం ద్వారా తమ కేసులను పరిష్కరించుకునేందుకు జాతీయ లోక్‌ అదాలత్‌ ఎంతగానో దోహదపడుతుంది. ఈమేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ, సెక్రటరీ, నర్సంపేట సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధిని ఆధ్వర్యంలో మహబూబాబాద్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ జరగనుంది. అదే విధంగా తొర్రూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జూనియర్‌ సివిల్‌ జడ్జి ధీరజ్‌ కుమార్‌ ఆధ్వర్యంలోనూ లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నారు.

సత్వర న్యాయం, సమస్యల పరిష్కారం..

సత్వర న్యాయం, సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న లోక్‌ అదాలత్‌ వేదికగా కక్షిదారులు రాజీ కుదుర్చుకుని కేసులను పరిష్కరించుకొని ప్రశాంతంగా జీవించాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కోరుతుంది. సుప్రీంకోర్టు 1987 సంవత్సరంలో లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి చట్టబద్ధమైన హోదాను కల్పించింది. అప్పటినుంచి ప్రతీ మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించి కేసుల పరిష్కారానికి జిల్లా న్యాయమూర్తులు చర్యలు తీసుకుంటున్నారు. జడ్జిలు, న్యాయవాదులు, న్యాయ సంస్థలు, ఎకై ్సజ్‌, సివిల్‌ పోలీసులు సమన్వయంతో వ్యవహరిస్తూ వివిధ కేసుల్లోని కక్షిదారులను సమన్వయం చేస్తూ కేసులను పరిష్కరిస్తున్నారు.

పరిష్కరించేందుకు సిద్ధం..

రాజీ పడదగిన సివిల్‌, మోటార్‌ వాహన ప్రమాదాలు, క్రిమినల్‌, వివాహ కుటుంబ కేసులు, బ్యాంకు చెక్కు బౌన్స్‌ కేసులు, ఎలక్ట్రిసిటీ, చిట్‌ ఫండ్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్సూరెన్స్‌, ఎకై ్సజ్‌, విద్యు త్‌ చోరీ (దొంగతనాలు), ట్రాఫిక్‌, ఈ చలాన్‌ కేసులను ఇరుపక్షాల అంగీకారంతో రాజీమార్గం ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. కక్షిదారులు తమ కేసుల వివరాలను సంబంధిత కో ర్టుల్లో తెలియజేసి రాజీ కుదుర్చుకుని కుటుంబసభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటున్నారు.

కక్షిదారులు కేసులు

పరిష్కరించుకోవాలి..

లోక్‌ ఆదాలత్‌ను వేదికగా చేసుకుని రాజీ కుదుర్చుకుని శాంతియుత వాతావరణంలో జీవించాలి. క్షణికావేశంలో జరిగిన ఘర్షణలు, కేసుల నమోదుల కారణంగా కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరిగి తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. అందుకనే లోక్‌ అదాలత్‌లో కేసులను రాజీచేసుకుని ప్రశాంతమైన జీవితం గడపాలి.

మహమ్మద్‌ అబ్దుల్‌ రఫీ,

జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి.

రాజీ కుదుర్చుకోండి..

ప్రశాంతంగా జీవించండి

నేడు జాతీయ లోక్‌ అదాలత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement