అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

Jun 14 2025 9:58 AM | Updated on Jun 14 2025 9:58 AM

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు

కొత్తగూడ: అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పంచాయతీరాజ్‌, సీ్త్ర, శిశు సంక్షేమ, గ్రామీణ తాగునీటి సరఫరశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని గోవిందాపురంలో ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐటీడీఏ ద్వారా మరిన్ని ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ నాయకులు ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తుంటే జీర్ణించుకోలేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి మాటలు నమ్మి మోసపోవద్దని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీ ర్వదించాలని కోరారు. అనంతరం గోవిందాపురం జీపీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు.

విద్యకు పెద్దపీట..

నాణ్యమైన విద్య అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క అన్నా రు. మండలకేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పిల్లలకుసామూహిక అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులకోసం ఏర్పాటు చేసిన డిజిటల్‌ తరగతుల మానిటర్‌ను పరిశీలించారు. విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేశారు. కొత్తగూడ, గంగారం మండలాల ప్రజలకు తాగు, సాగు నీరు అందించేందుకు పాకాల చెరువుపై లిఫ్ట్‌ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌, అదనపు కలెక్టర్‌ లెనిన్‌ వత్సవ్‌ టొప్పో, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్డీఓ మధుసూదన్‌రాజు, డీడబ్ల్యూఓ ధనమ్మ, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ సురేశ్‌, కొత్తగూడ, గంగారం మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement