
అసంక్రమిత వ్యాధులపై అవగాహన కల్పించాలి
నెహ్రూసెంటర్: అసంక్రమిత వ్యాధుల ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నర్సింగ్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మా ట్లాడుతూ.. టెలిమానస్ కార్యక్రమంలో భాగంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు స్పెషలిస్టు డాక్టర్లతో కౌన్సెలింగ్, చికిత్స అందించాలన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం ద్వారా అబా కార్డులను జనరేట్ చేయాలని సూచించారు. సమావేశంలో ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్రావు, మాస్ మీడియా అధి కారి కొప్పు ప్రసాద్, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, డీడీఎం సౌమిత్, సూపర్వైజర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్థాయికి మించి వైద్యం చేస్తే చర్యలు
డోర్నకల్: ఆర్ఎంపీలు స్థాయికి మించి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ రవిరాథోడ్ హెచ్చరించారు. డోర్నకల్ పట్టణం ఇందిరానగర్లోని ప్రైవేట్ క్లీనిక్లో నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నారని డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు శుక్రవారం క్లీనిక్ను సీజ్ చేశారు. బ్యాంక్ స్ట్రీట్లోని మరో క్లీనిక్లో ఆర్ఎంపీ స్థాయికి మించి వైద్యం చేస్తున్నాడని హ్యూమన్ రైట్స్కు స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు దానిని కూడా సీజ్ చేశారు. కార్యక్రమంలో అధికారి కొప్పు ప్రసాద్ పాల్గొన్నారు.