ప్రాణం పోస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

ప్రాణం పోస్తున్నారు..

Jun 14 2025 9:58 AM | Updated on Jun 14 2025 9:58 AM

ప్రాణ

ప్రాణం పోస్తున్నారు..

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం

రక్తదానంలో యువత ముందంజ

అవగాహన కల్పించడంలో ఎన్జీఓల కృషి

అత్యవసర సమయంలో కాపాడుతున్న రక్తదాతలు

ప్రమాదం జరిగినప్పుడు.. అనారోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు రక్తం అందక అనేకమంది మృత్యుఒడికి చేరిన ఘటనలున్నాయి. కానీ ప్రస్తుతం ఎన్జీఓలు, యువజన సంఘాలు రక్తదానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించడం ద్వారా రక్తదానంపై వారిలోని అపోహలను దూరం చేస్తున్నారు. తద్వారా అనేకమంది యువత రక్తదానం చేసి చావుబతుకుల్లో ఉన్నవారికి ప్రాణం పోస్తున్నారు. ఈనేపథ్యంలో నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భం ప్రత్యేక కథనం.

టేకుమట్ల: రక్తదానం చేయడం వల్ల నీరసించి ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడతాయనే అపోహ ప్రజల్లో ఉంటుంది. కానీ, అలాంటిది జరగదు. కేవలం 21 రోజుల్లోనే పూర్తి స్థాయిలో రక్తం శరీరంలో సమకూరుతుంది. అలాగే 6 నుంచి 12 వారాల్లో పురుషులకు, 6 నుంచి 16 వారాల్లో మహిళలకు హిమోగ్లోబిన్‌ స్థాయిలు సమంగా చేరుకుంటాయి. ఈవిషయంపై వివిధ స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, రెడ్‌క్రాస్‌ వంటి సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ రక్తదానం చేసేలా చొరవ చూపుతున్నాయి. దీంతో యువత రక్తదానం వైపు అడుగు వేస్తూ ఎంతో మంది ప్రాణాలను నిలబెడుతున్నారు.

ఎవరు రక్తదానం చేయాలి..

ఎవరు రక్తదానం చేయాలనే విషయంపై ఎంతో మంది ఆలోచనలో పడి రక్తదానం చేయడంలో కాస్త వెనుకడుగేస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలలోపు ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు రక్తదానం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, హెపటైటిస్‌ బీ, హెచ్‌ఐవీ, రక్తహీనత, బలహీనత, షుగర్‌, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు.. రక్తదానం చేసేందుకు అనర్హులుగా వైద్యులు చెబుతారు.

ఎంతో మందికి పునర్జన్మ

అత్యవసర సమయంలో రక్తదాతల నుంచి సేకరించిన రక్తంతో ఎంతో మంది పునర్జన్మ పొందారు. కరోనా మహమ్మారి వ్యాప్తి సమయంలో రక్త నిల్వలు లేక ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. అలాంటి పరిస్థితి రాకుండా రక్తదానం చేస్తూ ప్రాణాలను కాపాడాలని పలువురు మానవతావాదులు కోరుతున్నారు.

ప్రాణం పోస్తున్నారు..1
1/1

ప్రాణం పోస్తున్నారు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement