
ఆయుర్వేదంలో నూతనవిధానాలను అన్వేషించాలి
● స్టేట్ లెవల్ కౌశలం–2025 సదస్సులో ప్రముఖ వైద్యులు
జనగామ: ఆయుర్వేద వైద్య రంగంలోకి రాబోతున్న నూతన వైద్యులు నూతన విధానాలను అన్వేషించాలని ప్రముఖ వైద్యులు పేర్కొన్నారు. జనగామలోని వేద పంచఖర్మ వెల్నెస్ సెంటర్, విశ్వ ఆయుర్వేద పరిషత్ తెలంగాణ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ కౌశలం–2025 సదస్సును నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాలల్గో రోజు సదస్సులో డాక్టర్ కల్నల్ భిక్షపత్తి మాట్లాడుతూ హృదయం, మెదడు, శ్వాస సంబంధిత అత్యవసర పరిస్థితులపై వైద్యవృత్తిని చేపట్టబోతున్న విద్యార్థులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. డాక్టర్ శివ మాట్లాడుతూ.. శాలాక్య తంత్రంలో స్వస్థ వృత్తం(తెల్లవారు లేచింది మొదలు పడుకునే వరకు యాక్టివిటీస్) ప్రాముఖ్యతను వివరించారు. రుతు, దినచర్యలు మనిషి ఆరోగ్య పరిరక్షణకు ఎలా ఉపయోగపడతాయనే పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. అనంతరం డాక్టర్ వందనాసింగ్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ లక్ష్మణ్ యాదవ్, డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడారు.